Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాచకొండ సీపీ మహేష్ భగవత్
నవతెలంగాణ-మల్కాజిగిరి
కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. బుధవారం రాచకొండ కమిషనరేట్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం ప్రతి ఒక్కరూ మాస్కు, శానిటైజర్ వాడాలని, మాస్కులు ధరించని వారిపై ఈ చలాన్ ద్వారా కేసు నమోదు చేసి రూ.1000 జరిమానా విధిస్తున్నామని తె లిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తించి కేసులు నమోదు చేసి ఫైన్వేస్తామని అన్నారు. మంగళవారం మాస్క్ ధరించని 832 మందిపై కేసులు నమోదు చేసామన్నారు. పోలీసులు కూడా కరోనా వైరస్ పై ప్రధాన కూడళ్లలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారని, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఐదువేల మంది సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారని వెల్లడించారు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ చేసుకునే వారు రెండు వందల మంది కంటే ఎక్కువగా గుమిగూడకుండా జాగ్రత్త వహిచాలని సూచించారు.