Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆబిడ్స్
పద్యా రచనలలో సాహిత్య రంగంలో కృషి చేస్తున్న ఉత్తమ శ్రేణికవులకు సాహిత్య పురస్కారం ప్రధానం సముచిత్తం అని జ్ఞాన పీఠ పురస్కారగ్రహీత, పద్మభూషణ్ డాక్టర సి.నారా యణరెడ్డి అన్నారు. బుధవారం ఆబిడ్స్ ఆంధ్ర సారస్వత పరిషత్తులో తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు, కవి ఆచార్య అనుమాండ్ల భూమయ్యకు, ప్రముఖ కవి జక్కని వెంకటరాజంకు, డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య ధర్మనిధి సాహిత్య పురస్కారాలు ప్రధానం చేశారు.అనంతరం డాక్టర్, సీనారే మాట్లాడుతూ డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య ఉత్తమ కవి, గేయకర్త, విమర్శకుడు, వ్యాసకర్త, వక్త తెలుగు సాహిత్య రంగంలో అగ్రశ్రేణిలో ప్రతిభను చుటారాని కోనియాడారు.ప్రతి యేట సాహిత్య రంగంలో రాణిస్తున్న కవులను ప్రోత్సహిస్తు శ్రీనివాసాచార్య ధర్మ నిధి సాహిత్య పురస్కరాలను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ప్రధాన కార్యదర్శి డాక్టర్.జె.చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.