Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న సమ్మె గురువారంతో 9వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా జిల్లెలగూడలో కార్మికులు అర్ధనగ ప్రదర్శన చేశారు. బోడుప్పల్లో కార్మికుల సమ్మెకు టిడిపి నాయకులు, దుండిగల్లో సిపిఎం, సిపిఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.
కార్మికులపై ద్వంద్వ నీతి సహించం...
దుండిగల్ : కార్మికులపై ప్రభుత్వ ద్వంద్వ నీతిని సహించేది లేదని సిఐటియు మండల కార్యదర్శి వీరాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్భుల్లాపూర్ మండల కార్యాలయం వద్ద పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు సిఐటియు జోన్ అధ్యక్షుడు కె.లక్ష్మన్, సిపిఎం నాయకుడు టివి ఎస్.రమణ, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు ఏసురత్నం, నర్సిం హ, సిపిఐ మండల కార్యదర్శి జి.ఐలయ్యలు సంఘీబావం తెలిపా రు. ఈ సందర్భంగా వీరాచారి మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికు ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎల్ల య్య, వెంకటరాజ్యం, మల్లేష్, జబ్బార్, సత్యం, నాయకులు యాద గిరి, సురేష్, వెంకటేష్, పాల్గొన్నారు.
సమ్మెకు టిడిపి నాయకుల మద్దతు
బోడుప్పల్ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించా లని కోరుతూ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు టిడిపి నాయకులు మద్దతు తెలిపారు. బోడుప్పల్ గ్రామ పంచాయతీ పరిధిలోని కార్మికులు విధులు బహిష్కరించి కార్యా లయం ముం దు ధర్నా కార్యక్రమాన్ని చెపట్టారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఎంపిటిసి సభ్యుడు అశోక్ యాదవ్ మాట్లాడుతూ గ్రా మ పంచాయతీ సిబ్బంది దేవుళ్లని చెప్పిన ముఖ్యమంత్రి సమ స్యల పరిష్కారం కోసం వారు సమ్మె చేస్తుంటే ఎందుకు పట్టిం చుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదిర్శి మీసాల కృష్ణ, సీనియర్ నాయకులు సాయిని అమృతం, జె.రాములు, సత్యనారయణ, గ్రామ శాఖ కార్యదర్శి మల్లేష్, తెలుగు యువత అధ్యక్షులు చంటి శ్రీవివాస్, ఎస్సీసెల్ అధ్యక్షులు రమేష్, అదిమూలం కారుణకార్, సిఐటియు నాయకులు బాల నర్సింహ్మ, రాఘవరెడ్డి, జానిలు పాల్గొన్నారు.
జిల్లెల గూడలో కార్మికుల అర్ధ నగ ప్రదర్శన
సరూర్నగర్ : సరూర్నగర్ మండలం మీర్పేట, జిల్లెలగూడ, జల్పల్లి, పహడిషరీఫ్, కొత్తపేట గ్రామాలకు చెందిన గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె గురువారం 9వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా జిల్లెలగూడ గ్రామ పంచాయతీ ఎదుట పంచాయతీ సిబ్బంది, కార్మికులు అర్ధనగ ప్రదర్శన చేసి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి కాల్వ శంకర్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభు త్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దాసరి బాబు, టిఆర్ఎస్ నాయకులు అడపరవి, గ్రామ పంచాయతీ కార్మికులు కమలమ్మ, పెంటమ్మ, స్వరూప, జగన్, ఎల్లయ్య, సురే ష్, జీవన్, భారతమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన
హయత్నగర్ : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హయత్నగర్ మండల కార్యాలయం ముందు పారిశుధ్య కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి డి.కిషన్ మాట్లా డుతూ దళితుల, సామాజిక తరగతుల శ్రమను పాలకవర్గాలు దోచుకొని మోసం చేస్తున్నాయని విమర్శించారు. కార్మికులు 9రో జులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్మికులకు హెల్త్కార్డులు, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వా లని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటస్వామి, చంద్రమ్మ, సక్కమ్మ, పుశ్యయ్య, ధనంజరు, అశోక్, యాదగిరి, లక్ష్మమ్మ, బాలయ్య, నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.