Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగో రోజుకు సమ్మె
-సర్కిల్ కార్యాలయాల వద్ద ధర్నాలు
- పలు చోట్ల ర్యాలీలు, ప్రభుత్వ దిష్టి బొమ్మలు దహనం
కాంగ్రెస్, టిడిపి నాయకుల మద్దతు
రాజేంద్రనగర్ : మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు రాజేంద్రనగర్ జోన్ అధ్యక్షుడు వి.జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ సర్కిల్ మున్సిపల్ కార్మికులు వరసగా నాల్గోరోజు సర్కిల్ కార్యాలయం ఎదుట బైఠాయిం చారు. ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి తనయుడు కార్తీక్రెడ్డి, భవన, ఇతర నిర్మాణ రంగ రాష్ట్ర అధ్యక్షులు కురమయ్య వచ్చి కార్మికులకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సా మ ఇంద్రపాల్రెడ్డి, మాజీ కార్పొరేటర్ టి,ప్రేమ్దాస్గౌడ్, కొ లన్ సుభాష్రెడ్డి, రామేశ్వర్ రావు, చిత్తరి, పాల్గొన్నారు.
బతుకమ్మలతో కార్మికుల నిరసన
దిల్సుఖ్నగర్జోన్ప్రతినిధి: ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయం లో పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించి బతుకమ్మ ఆ డుతూ నిరసన తెలిపారు. గురువారం పారిశుధ్య కార్మికులు కార్యాలయం ముందు బతుకమ్మలతో నిరసన తెలిపారు. సిఐ టియు, ఏఐటియుసి, బిఎంఎస్ ఆధ్వర్యంలో సమ్మె కొనసా గుతోంది. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు సోమయ్య, నాయకులు మద్దిలేటి, ఏఐటియుసి నాయకు లు చందు, సిపిఐ నాయకులు పాండురంగాచారి, బిఎంఎస్ నాయకులు నరేందర్, సిఐటియు జోన్ అధ్యక్షుడు కె.రాములు, నాయకులు వెం కన్న, ఎల్లయ్య, రమాచారి, యాదమ్మ, జెఏసి నాయకులు శివకుమార్ పాల్గొన్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాల్డి
సరూర్నగర్: పారిశుధ్య కార్మికులపై ప్ర భుత్వం నిర్లక్ష్యం వీడాలని సిఐటియు సౌత్ జోన్ కార్యదర్శి ఇ.ఎస్.ఎన్రెడ్డి, బడంగ్పే ట నగర పంచాయతీ వైస్ చైర్మన్ చిగురిం త నర్సింహ్మరెడ్డి డిమాండ్ చేశారు. గురువా రం కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు కార్మి కులకు మద్దతు తెలిపారు. కార్మికులు ప్రభుత్వ దిష్టిబొమ్మను బడంగ్పేట చౌరస్తా వద్ద దహనం చే శారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ టియు సౌత్ జోన్ కార్యదర్శి ఇ.ఎస్.ఎన్రెడ్డి, బడంగ్పేట నగరపంచాయతీ వైస్ చైర్మన్ చిగురింత నర్సింహ్మరెడి మా ట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు యాతం శ్రీశైలం, డి.గణే ష్, ఇంద్రవెల్లి యాదయ్య, కాంగ్రెస్ నాయకులు బీమిడి జంగా రెడ్డి, గుర్రం వెంకట్రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి కాల్వ శంకర్, బిల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. బడంగ్పేట నగరపంచాయతీ మేనేజర్ జ్ఞానేశ్వర్కు వైస్ చైర్మన్ చిగురిం త నర్సింహ్మరెడ్డి, కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు.
రోడ్లపై పేరుకుపోతున్న చెత్త
రాంనగర్: జిహెచ్ఎంసి కాంట్రాక్టు కార్మికులు తమ డిమాం డ్ల సాధన కోసం చేస్తున్న సమ్మె గురువారం నాల్గో రోజుకు చే రింది. సమ్మె కారణంగా చెత్త చెదారంతో దుర్గంధంగా మారా యి. రాంనగర్, లలితానగర్, శాస్త్రినగర్, అడిక్మెట్ ప్రాంతా లోని రోడ్లు దర్శనమిస్తున్నాయి.
పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం
అల్వాల్: సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేయడా న్ని సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ తీవ్రం గా ఖండించారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గురువారం అ ల్వాల్ మున్సిపల్ కార్యాలయం నిర్వహించిన ధర్నా, ర్యాలీలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమం లో సిపిఐ కార్యదర్శి దశరథ, జిల్లా కార్యదర్శి రవిచంద్రన్, అ ల్వాల్ పట్టణ సిపిఐ కార్యదర్శి జంగయ్య, హెచ్ఎంఎస్ నా యకులు అప్సర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం చేస్తే ప్రజా ఉద్యమమే
కుత్బుల్లాపూర్: కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ప్ర జా ఉద్యమం తప్పదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకా నంద్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ హెచ్చరించారు. గు రువారం కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఎన్నికల ముందు కార్మికుల సమ స్యలను పరిష్కరించి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కుత్బుల్లాపూర్ జోన్ కార్యదర్శి లక్ష్మణ్, టివిఎస్ రమణ, సిపిఐ నాయకులు యేసురత్నం, గూడ ఐలయ్య, కాంగ్రెస్ నాయకులు పి.అంజన్గౌడ్, టి.లక్ష్మారెడ్డి, టీడీపీ నాయకులు గడ్డం రాజేందర్రెడ్డి, మోటే శ్రీనివాస్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఐఎఫ్టియు ఆధ్వర్యంలో
షాపూర్నగర్లోని ఉషోదయ టవర్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసిన అనంతరం ఐఎఫ్టీయూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షురాలు అనురాధ, నగర నాయకురాలు జి.పద్మలు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.
ప్రభుత్వం దిగొచ్చే వరకు సమ్మె
సైదాబాద్: ప్రభుత్వం దిగొచ్చి కార్మికులకు వేతనాలు పెంచేత వరకు సమ్మె విరమించేది లేదని సిఐటియు గ్రేటర్ హైదరా బాద్ సౌత్జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.సత్యనారాయణరెడ్డి డి మాండ్ చేశారు. జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులు తమ వే తనాలు పెంచాలని ఐఎస్ సదన్లో సిఐటియు యాఖత్పుర జోన్ కార్యదర్శి పి.దేవయ్య నాయకత్వంలో చేస్తున్న సమ్మె కొనసాగింది. ఐఎస్ సదన్ చౌరస్తా నుండి చంపాపేట చౌ రస్తా వరకు సిఐటియు జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా, ఇఎస్ఎన్ రెడ్డి మాట్లాడారు. కార్మికులెవ్వరు బె దిరింపులకు భయపడొద్దు, ప్రభుత్వం దిగొచ్చి వేతనాలు పెం చేంత వరకు సమ్మేను వీడొద్దని అన్నారు. ఇప్పటికే నగర మంతా కంపుకొడుతోంది, ఇంకా కార్మికుల వేతనాల పెంపు విషయంలో ప్రభుత్వం అలసత్వం వీడకపోతే, ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సం ఘం సౌత్జిల్లా నాయకులు ఎం.బాలునాయక్, విజయలక్ష్మి, ఇంద్రమ్మ, యాదమ్మ, నిర్మల, కార్మికులు పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికుల ధర్నా
ఉప్పల్: ఉప్పల్ మున్సిపల్ ఆవరణలో పారిశుధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. సుమారు 500 మంది కార్మికులు ఉప్ప ల్ జోన్ పరిధిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ జో న్ ప్రధాన కార్యదర్శి జె.వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వం పా రిశుధ్య కార్మికులను అశ్రద్ద చేస్తుందని విమర్శించారు. ఇప్పట ికైనా స్పందించి పారిశుధ్య కార్మికుల సమస్యలను వెంటనే పరి ష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు సిఐటియు నాయకులు రాము, బీష్మాచారి, కార్మికులు తది తరులు పాల్గొన్నారు.
సమ్మె కొనసాగిస్తాం
మియఫూర్: ప్రభుత్వం దిగొచ్చి కార్మికుల న్యా యమైన డిమాండ్లను తీర్చాలని సిపిఎం శేరిలింగంపల్లి కార్య దర్శి శోభన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చందానగర్ సర్కి ల్ 12 కార్యాలయం వద్ద కార్మికులు సమ్మె కొనసాగించారు. శోభన్ మాట్లాడుతూ రాత్రనకా, పగలనకా కష్టపడి నగర రో డ్లను, కాలనీలను శుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు జీతాలు పెంచితే వచ్చే నష్టం లేదన్నారు. అనంతరం ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయ కులు కొంగరి క్రిష్ణ, మాణిక్యం, బిఎంఎస్ నాయకులు అశోక్, శ్రీనివాస్ రెడ్డి, రాజు, జెఎసి నాయకులు తిప్పర్తి మహేష్ కార్మి కులు పాల్గొన్నారు.
దిష్టిబొమ్మ దహనం
అమీర్పేట్: కార్మికుల సమస్యలను పరిష్కరిం చడంలో ప్రభుత్వం విఫలమైందని సిఐ టియు ప్రధాన కా ర్యదర్శి జంగ య్య అన్నారు. గురువారం అ మీర్పేట్ చౌర స్తాలో కార్మికుల తో కలిసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేసి మాట్లాడా రు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ప్రభు త్వం నుండి సరైన స్పందన కరు వైందని మండిపడ్డారు. కార్యక్రమంలో ప్రేమ్ కుమార్, ప్రవీన్, రేణుకాఎల్లమ్మ, సుజాత, జి.అనిత, నర్సమ్మ, రాజేశ్వరి, పద్మ, లక్ష్మి పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వీడాలి
కాప్రా: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, కార్మికశాఖ మంత్రివర్యులు నిమ్మకు నీరెత్తి నట్లు నిర్యక్షంగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయూస్ యూ నియన్ నాయకులు విమర్శించారు. కా ప్రా సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా చేప ట్టారు. ఇసిఐఎల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర మంత్రులకు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మంచి బుద్ధి ని ప్రసాదించాలని విన్నవించుకున్నారు. భారీ ర్యాలీగా కాప్రా సర్కిల్ కార్యాలయా నికి చేరుకున్నారు. కార్యక్రమంలో సిఐ టియు నాయకులు జె.చంద్రశేఖర్, జి.శ్రీ నివాసులు, శివయ్య, దశరద్, నర్సింహా, యాదగిరి, లింగయ్య ఏఐటియు నాయ కులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
మల్కాజిగిరి జోన్ ప్రతినిధి: సమస్యల ను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుం దని సిఐటియు అధ్యక్షులు పి.నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజిగి రి చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను ద హనం చేశారు. వారు మాట్లాడుతూ వేత నం అమలు చేసేవరకు పోరాటం కొన స్తామన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు శ్రీనివాస్, మంగ, ప్రభాకర్, మున్సిపల్ కార్మిక నాయకులు ఐలయ్య పాల్గొన్నారు.
వేతనం పెంచే వరకు విధుల్లో చేరం
వెంగళరావునగర్: వేతనాలు పెంచే వరకు విధుల్లోకి చేరేది లేదని పారిశుధ్య కార్మికులు యూసూఫ్గూడ వార్డు కార్యాల యం ఎదుట ఆందోళన చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో వెంగళరావునగర్, యూసూఫ్గూడ, బోరబండ,ఎర్రగడ్డ డివి జన్లలో పని చేసే కార్మికులు యూసూఫగూడ వార్డు కార్యా లయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జుబ్లీ హిల్స్ ఇంచార్జి టి.సాయిశేషగిరిరావు పాల్గొన్నారు. కార్యక్ర మంలో శ్యామల, లింగమ్మ, వెంకటయ్య, నిర్సంహ్మా, యాదగి రి, వెంకటేష్, ఆంజనేయులు, కార్మికులు పాల్గొన్నారు.
పాతబస్తీలో భారీ ర్యాలీ
ధూల్పేట్: టిఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్య పాలన కొనసాగిస్తుం దని సిఐటీయూ సౌత్ జోన్ సీనియర్ నాయకులు చంద్రమో హన్, శేఖర్ యాదవ్లు ఆరోపించారు. గురువారం సమ్మె చే స్తున్న మున్సిపల్ కార్మికులకు అండగా పాతబస్తీలో భారీ ర్యా లీ నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు మ ద్దతుగా సర్దార్ మహల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగా రు. సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసు రంగ ప్రవేశం చేసి ధర్నాను భగం చేయడానికి ప్రయత్నించారు. పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వదం చోటుచేసుకుంది. కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతోపాటు నాయకులు కోట య్య, రాములు, యాదవ్, శంకర్, ఐలేష్ పాల్గొన్నారు.
హైదరాబాద్: సిఐటియు ముషీరాబాద్ జోన్ కమిటీ ఆధ్వ ర్యంలో ముషీరాబాద్ వార్డు ఆఫీసు మందు ధర్నా చేశారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సిఐటియు నగర ఉపా ధ్యక్షుడు దశరథ్ హాజరై మాట్లాడారు.
బేగం బజార్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.