Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్
నవతెలంగాణ-సూరారం
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అధికారుల కు ఆదేశించారు. మంగళవారం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్, పాపయ్య యాదవ్నగర్లలో ఫెన్సింగ్, మోరీ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీపడకుండా పని చేయాలని సూచించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు మురుగు కాలువలుల ఉప్పోంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయని తెలిపారు. అక్రమణలు, పూడికల వల్ల సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. పూడికలను, అక్రమణలను తొలగించడంతో పాటు డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కొత్త పైపులైన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపోందిస్తామని తెలిపారు. అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కె.ఎం.గౌరీష్, బొడ్డు వెంకటేశ్వర్రావు, వార్డు కమిటీ సభ్యులు సత్తిరెడ్డి, యాదగిరి, నర్సింహా, ఈఈ రాజ్కుమార్, డీఈ లాల్సింగ్, ఎఈ మల్లారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతలకు అండగా రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు శ్రీకారం
మంగళవారం చింతల్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రైతులకు దిగుబడి పెంపు, గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మార్కెట్ సదుపాయాలు పెంచేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. రైతు సమన్వయ సమితిలతో రైతులో ఆత్మస్థైర్యం పెంపోందుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు సమితిలను ఏర్పాటు చేస్తారని, వాటిలో గ్రామ, మండల రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 954మంది అర్హులైన రైతులను గుర్తించినట్టు తెలిపారు. గ్రామ కమిటీల్లో 15 మంది, మండల కమిటీల్లో 24 మంది సభ్యులు ఉంటారని వివరించారు. గ్రామంలో నివాసం ఉంటూ పట్టా భూమిలో వ్యవసాయం చేసే వారికి గ్రామ రైతు సమన్వయ సమితిలోసభ్యుడిగా ఉండేందుకు అర్హత ఉంటుందన్నారు. సమితి సభ్యులో మూడవ వంతు మంది మహిళ రైతులు తప్పక ఉండాలన్నారు. సమితి సభ్యులో గ్రామంలోని అన్ని సామాజిక వర్గాలకు చెందిన రైతులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల సభ్యులు, కో-అర్డినేటర్ల నామినేషన్ పద్ధతిలో ఎమ్మెల్యే ఎంపిక చేసి సెప్టెంబర్ 9న గ్రామ, మండల కమిటీలను ప్రభుత్వానికి పంపింస్తామని తెలిపారు.
పేద, మధ్య తరగతి ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలలో అర్హులైన లభ్దిదారులకు మంజూరైన 31 చెక్కులను మంగళవారం గాజులరామారం డివిజన్ పరిధిలో ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిలు ఇంటింటికీ తిరిగి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.అంజన్గౌడ్, వార్డు కమిటీ సభ్యులు ఎండీ మసూద్, మల్లేష్, లాల్మహమ్మద్, కుర్షిదాబేగం, ఫర్దానాబేగం, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
జీడిమెట్ల డివిజన్ పరిధిలోని వెన్నెలగడ్డ చెరువును ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిమజ్జనంకు వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించేలా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ జానకి శర్మిల, ఏసీపీ శ్రీనివాస్, ఉపకమిషనర్ సుదాంశ్, ఈఈ రాజ్కుమార్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.