Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జవహర్నగర్
జవహర్నగర్లో మిగ్వా ఫౌండేషన్, జెర్రీ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని సర్పంచ్ గడ్డమీది మల్లేష్, ఉపసర్పంచ్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా అన్నారు. మంగళవారం స్ధానిక బీజేఆర్ నగర్ తులసిహై స్కూల్ మిగ్వా ఫౌండేషన్, జెర్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. విద్యార్థులకు విటమిన్ ఏ, నట్టల నివారణ మందులు సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు బొబ్బిలి మంజుల, మహేశ్వరి, టీఆర్ఎస్ మైనార్టీ అధ్య క్షుడు సయ్యద్సాదిక్, మిగ్వా, సభ్యులు జీవ రత్నం, కృష్ణమూర్తి, రాజమౌలి, ప్రభుదాస్, శేఖ ర్, ఎల్లస్వామి, శంకర్, రాములు పాల్గొన్నారు.