Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఏఎస్రావునగర్
పబ్లిక్ సెక్టార్ రంగంలో కార్మికుల సమస్యలపై ఎనలేని కృషి చేసి పదవీ విరమణ పొందిన రాఘవరావును కార్మికులు, నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సీఐటీయూ నాయకులు కవి యాదగిరిరావు రచించిన జీవో పుస్తకాన్ని ప్రముఖ కవి నరహరి ఆవిష్కరించారు. అనం తరం సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా మాట్లాడుతూ బెల్ కంపెనీలో యూనియన్ అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా ఉంటూ కార్మికుల హక్కుల కోసం రాఘవరావు ఎంతో పోరాటం చేశారని అన్నా రు. పరిసర ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లో కూడా ఎంతో పనిచేశా రని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేసి, బడా వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. ఇలాంటి విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికుల్లో చైతన్యం నింపేందుకు ఆయన నిత్యం కృషి చేశారన్నారు. రాఘవరావు మాట్లాడుతూ 32 ఏండ్లుగా బెల్ కంపెనీలో సీఐటియూ అధికారంలో ఉందనీ, కార్మికుల్లో, ఉద్యోగుల్లో మంచి గుర్తింపు సాధించామని చెప్పారు. పదవి విరమణ పొందినా సీఐటీయూలోనే కొనసాగుతానని తెలిపారు. ఈ కార్యక్రమం లో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.నర్సింహారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సత్యం, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు కోమటి రవి, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.