Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ కార్యాలయం ఎదుట బైటాయింపు
- సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం
- ప్లకార్డులతో నిరసన
- టీడీపీ నాయకుల అరెస్ట్... విడుదల
నవతెలంగాణ-సిటీబ్యూరో
సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నగరంలోని నాంపల్లిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం హైదరాబాద్ నగర కమిటీ, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యు లు రావుల చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ మూడున్నరేండ్లుగా పాలిస్తున్న టీఆర్ఎస్ హైదరాబాద్ను విశ్వనగరంగా మారు స్తామని చెప్పి విస్మరించిందన్నారు. నగరంలో గుంతల రోడ్లు, ట్రాఫిక్, తదితర సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారన్నారు. మియాపూర్ భూములు, నయిం, డ్రగ్స్ కేసులు నీరుగార్చారని ఆయన ఆరోపించారు. టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంఎన్. శ్రీనివాసరావు మాట్లాడుతూ బస్తీ ల్లో అనేకమంది పేదలు వివిధ సమస్యలతో సతమతమ వుతున్నారన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేద న్నారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి, తదితర పథకాలతో ప్ర చార ఆర్భాటాలు గుప్పించిన ప్రభుత్వం లబ్దిదారుల దరఖా స్తులు కార్యాలయాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకు పోయా యన్నారు. ఈ పథకాల మంజూరీ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోయారన్నారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు. ప్లైఓవర్లు, స్కైవేలు, వివిధ భవనాలకు శంకుస్థాపనలు చేసి ఏండ్లు గడుస్తున్నా నిర్మాణా లకు నోచుకోవడంలేదన్నారు. మెట్రోరైలు ఇంకను ప్రారంభా నికి నోచుకోలేదన్నారు. జీహెచ్ఎంసీని అవినీతి రహితంగా తీర్చిదిద్దాలని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్ పట్టించుకోవ డంలేదన్నారు. అనంతరం సమస్యలతో కూడిన మోమోరాం డంను కలెక్టర్కు అందజేశారు. ఈ ధర్నా సందర్భంగా టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్చేసి అబిడ్స్ పోలీస్స్టేషన్కు తరలించి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ ధర్నాలో టీడీపీ నాయకులు సాయి బాబా, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షు లు కూన వెంకటేశం గౌడ్, టీడీపీ నాయకులు బజరంగ్శర్మ, వనం రమేశ్, బిఎన్.రెడ్డి, ప్రదీప్చౌదరి, షకీలారెడ్డి, మేకల సారంగపాణి, బద్రినాథ్, మధుకర్, నల్లెల్ల కిషోర్కుమార్, జ్ఞానేశ్వర్, పి.లక్ష్మణ్, బాలరాజు, అంజాద్అలీఖాన్, శ్యామ్ సుందర్, రాజేందర్, రహమాన్, ప్రవీణ్, కొంరయ్య, ఎంఎ. షపీఖ్, కె.కృష్ణాగౌడ్, ఎ.సురేశ్, ఝాన్సీ, ప్రమీల, శోభ, అనిల్ చారి, శ్రీహరి, వెంకటేశ్, ఓంప్రకాశ్, అన్వర్, కిరణ్, శంకర్, ఎం.నర్సింగరావు, శ్రీధర్చారి, చంద్రశేఖర్, గౌరీశంకర్, బాబా రావు, యాదగిరి, రవి, అలిబిన్సయిద్, గురుదీప్సింగ్, కేశవకుమార్, జహీరుద్ధీన్, సలీం, కవిత, నగేశ్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.