Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ-బడంగ్పేట
మాజీహోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని విమర్శించే స్థాయి టీఆర్ఎస్ నాయకుడు కొత్త మనోహర్రెడ్డికి లేదని, ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని కాంగ్రెస్ బడంగ్పేట నగరపంచాయతీ అధ్యక్షులు సూర్ణగంటి అర్జున్, వైస్ చైర్మన్ చిగురింత నర్సింహారెడ్డి, ప్లోర్ లీడర్ యాతం శ్రీశైలంలు హెచ్చరించారు. మంగళవారం బడంగ్పేటలోని పెదబావి లక్ష్మమ్మ పంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు మహేశ్వరం నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని అన్నారు. రాజకీ యంగా వార్డు సభ్యుడిగా గెలువలేని నీవు మాజీ మం త్రిని విమర్శించే స్థాయి నీకు లేదన్నారు. కోట్లాది రూపాయలతో నియోజక వర్గంలో బీటీరోడ్లు, సీసీరోడ్లు, డ్రెయినేజీలు, కృష్ణావాటర్ పైపులైన్లు ఏర్పాటు చేశారన్నారు. పేదకోసలం కుర్మల్గూడలో 4వేల ఇండ్లను జేఎన్ఎన్ఆర్యూఎం పథకంలో నిర్మాణం చేయించటం జరిగిందని అందులో లబ్దిదారులను ఎంపిక చేయలేని టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ను విమర్శిం చటమేమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సరూర్నగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు హన్మత్రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆనంద్రెడ్డి, కౌన్సిలర్లు పెద్దబావి శ్రీనివాస్రెడ్డి, దండు గణేష్ ముదిరాజ్, గుర్రం వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.