Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోకిరీపై సీసీఎస్లో ఫిర్యాదు
- నిర్భయ కేసు నమోదు చేసిన షీ టీమ్స్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆమె మహిళా ఇన్స్పెక్టర్, డ్యూటీలో ఉంటే డైనమిక్ ఆఫీ సర్... మహిళలకు, బాధితులకు అండగా నిలుస్తోంది... కానీ ఆమెకే వేధింపులు తప్పలేదు. సౌత్జోన్ పరిధిల్లో మహిళా పోలీస్స్టేషన్లో సీఐగా పనిచేస్తున్న లక్ష్మీ మాధివికి కొద్దిరోజు లుగా ఓ ఆకతాయి ఫోన్చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతు న్నాడు. ఇన్స్పెక్టర్ అని తెలిసి కూడా పోకిరీ రెచ్చిపోయి ఫోన్లు చేస్తుండడంతో బాధితురాలు సీసీఎస్లో ఫిర్యాదు చేశా రు. ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆకతాయి కోసం సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలావుంటే లక్ష్మీ మాధవి గతంలో ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేశారు. అంద రితో కలివిడిగా ఉంటూ బాధితులకు న్యాయం చేసేవిధంగా పనిచేస్తుందని పేరుంది. అలాంటి ఇన్స్పెక్టర్కు సైతం ఆక తాయిల నుంచి వేధింపులు తప్పకపోవడంతో పోలీస్ వర్గా ల్లో చర్చనీయాంశమైంది. ఈ సంఘటనపై స్పందించిన డీసీ పీ అవినాష్ మహంతి ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో నింది తుడిపై కేసును నమోదు చేశామన్నారు. తదుపరి విచారణ నిమిత్తం షీ టీమ్స్కు కేసును అప్పగించామన్నారు. నిందితు డిపై నిర్భయ కేసు నమోదు చేశామని షీటీమ్స్ ఏసీపీ కవిత తెలిపారు. అన్నికోణాల్లో విచారిస్తున్నామని త్వరలోనే నింది తుడిని అరెస్టు చేస్తామన్నారు.