Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే క్రిష్ణారావు
నవతెలంగాణ-కూకట్పల్లి
నాయీ బ్రాహ్మణులకు ఎల్లప్పుడు అండగా ఉంటానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆ సం ఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వారికి రావాల్సిన బీసీ రుణాలు వచ్చేలా చూస్తానన్నారు. ప్రతీ శ్మశానవాటికలో గదులు కట్టిస్తానని, ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉంటే ప్రతి డివిజన్లో కమ్యూనిటీ హాల్స్ కట్టించనున్న ట్టు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ట్టుగా వారి సెలూన్లలో విద్యుత్ చార్జీలు తగ్గించేందుకు అధికారులతో మాట్లాడి వెంటనే అమలయ్యేలా చూస్తాన న్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు సతీష్నాయి, నాయకులు ముత్యాలు నాయి, శ్రీనివాసులునాయి, నర్సింహానాయి, విజరుకుమార్నాయి, మధునాయి, మలకయ్యనాయి, రముష్నాయి, తిరుపతయ్యనాయి, నగేష్నాయి, దుర్గయ్యనాయి తదితరులు పాల్గొన్నారు.