Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా
నవతెలంగాణ-బడంగ్పేట
జల్పల్లి మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారికి ఐదునెలలుగా వేతనాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి కాల్వ శంకర్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మంగళవా రం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జల్పల్లి మున్సిపాలిటీలో 180 మంది శానిటేషన్ కార్మికులుగా పనిచేస్తున్నారన్నారు. కార్మికులకు నేటికీ ఇఎస్ ఐ, పీఎఫ్ స్లిఫ్లు ఇవ్వడం లేదన్నారు. కమిషనర్కు పలుమా ర్లు సమస్యలను పరిష్కరించాలని కార్మికులు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు. కొంత మంది కార్మి కులకు నెలవారీగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేసి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ నిత్యావసరాల సరుకులు, పరికరాలు, గుర్తింపుకార్డులు ఇవ్వా లని కోరారు. ఈ కార్యక్రమంలో డి.శ్రీనివాస్, అరుణ, వసం త,ఆటోడ్రైవర్ రాము, ట్రాక్టర్ డ్రైవర్ జంగయ్య, పాల్గొన్నారు.