Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీచర్ను నిలదీసిన గ్రామస్తులు
- అధికారుల పర్యవేక్షణపై ఆగ్రహం
నవతెలంగాణ - ఘట్కేసర్ రూరల్
అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నామని ఒకవైపు ప్రజాప్రతినిధులు చెబుతున్నా మరోవైపు క్షేత్రస్థాయిలో మాత్రం పురుగుల భోజనం దిక్కు అవుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోతుంది. మంగళవారం ఘట్కేసర్ మండలం యంనంపేట్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు పెట్టి అన్నంలో పురుగులు వచ్చాయి. దీన్ని గమనించిన స్థానికులు అంగన్వాడీ టీచర్ను నిలదీశారు. దీంతో అంగన్వాడీ టీచర్ స్పందిస్తూ వంట మేం చేయడం లేదని, కొంపల్లి నుంచి అన్నపూర్ణేశ్వరి ట్రస్టు వారు భోజనం సరఫరా చేస్తున్నారని తెలిపారు. పిల్లలకు పెడుతున్న ఆహారంలో పరుగులు వస్తున్నాయని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించు కోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.