Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
ఓయూలో కంప్యూటర్ సైన్స్ విభాగం స్థాపించి, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించిన ధిశాలి, నిరాడంభరుడు రమణమూర్తి అని ఓయూ వీసీ ఆచార్య ఎస్.రామచంద్రం ప్రశంసించారు. మంగళవారం ఓయూ కంప్యూటర్ సైన్స్ విభాగం, గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రమణమూర్తి పదవీ విరమణ సందర్భంగా ''కాన్టెంపరరీ అప్రొచెస్ ఇన్ సైంటిఫిక్ కంప్యూటరింగ్'' అనే అంశంపై రెండు రోజుల కాన్ఫరెన్స్ను వీసీ ప్రారంభించారు. అనంతరం డీఆర్డీఎల్, డీఆర్డీఓ, హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ దిబాసిస్ చక్రవర్తి సూపర్ కంప్యూటర్స్, దాని అప్లికేషన్స్, ఐఓటీ అప్లికేషన్స్, ఐఓటీ అప్లికేషన్లో బ్యాంకింగ్ సెకార్ట్ లాంటి అంశాలపై వీసీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వీఎన్శాస్త్రి, పీజీ సిద్దేశ్వర్ పీవీఎస్ మూర్తి, జేవీ రమణమూర్తి, డాక్టర్ హెచ్సీ రాణి, ఆచార్య రమణమూర్తి, గోవర్దన్రెడ్డి, శ్రీహరిరావు, సాంబశివరావు, వెంకటరమణ దేవి, రవికుమార్, రామేశ్వర్, సుధాకర్, సురేష్, బిక్షు, కృష్ణకుమారి పాల్గొన్నారు.
నర్సింగ్రావుకు ఓయూ వీసీ అండ బాధాకరం నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
ఓయూ సైన్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ నర్సింగ్రావుకు వీసీ రామచంద్రం అండగా నిలవడం బాధాకరమని ఏఐఎస్ఎఫ్ ఓయూ నేతలు కె.శ్రీనివాస్, రహమాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను, అధ్యా పకులను పలుమార్లు కులం పేరుతో దూషించిన నర్సింగ్రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యిందని, దీనిపై వీసీ కమిటీ వేసి 3 నెలలు దాటినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వందేండ్ల చరిత్ర గల ఓయూకు చేతగాని వీసీగా రామచంద్రం ఉండటం దురదృష్టకమన్నారు. ఇప్పటికైనా వీసీ స్పందించి నర్సింగ్రావుపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నర్సింగ్ రావుపై చర్యలు తీసుకునే వరకు ఉద్యమి స్తామని వారు హెచ్చరించారు.