Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తుర్కయాంజాల్
శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్, మన్నెగూడ విద్యార్థులు తమ విద్యార్జనలో భాగంగా ధార్మిక అనే అంశాన్ని అధ్యయనంచేస్తూ మానవత్వపు విలువలు పెంచుకునే లక్ష్యంతో సహకార కార్యక్రమాల్లో చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం 5 క్వింటాళ్ల బియ్యం, 70 కేజీల కందిపప్పును తుర్కయంజాల్ లోని కేర్ వారియర్స్ ఫౌండేషన్ అనే అనాథాశ్రమానికిఅందించారు. సామాజిక స్థితిగతులను అర్ధం చేసుకుంటూ పరోపకార భావం కలిగి ఉండటం మానవధర్మమనే ఈ కార్యక్రమం మధర్థెరిసా జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతీ ఏడాది చారిటబుల్ డే గా నిర్వహిస్తున్నట్టు మేనేజింగ్డైరెక్టర్ చింతల సంఘమేశ్వర గుప్త తెలిపారు. ఈ సహకార కార్యక్రమాన్ని జయప్రదం చేసిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి పాఠశాల డైరెక్టర్ బిట్ల శ్రీనివాస్రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యావత్సిబ్బంది, డైరెక్టర్లు బిట్ల శైలజ, చింతల వీణ, ప్రిన్సిపాల్ ఎలిజబెత్, కోఆర్డినెటర్స్ సత్యవతి, జ్యోతిఅరోర, రీట పాల్గొన్నారు.