Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డువిస్తరణలో నిర్వాసితులకు న్యాయం చేస్తాం
- రాజకీయాలకతీతంగా సహకరించండి
- కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు
నవతెలంగాణ - బాలానగర్
ప్రభుత్వం ప్రతిష్ట్టాత్మకంగా బాలానగర్ ప్లైఓవర్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో రోడ్ల విస్తరణలో భాగంగా ఇరువైపుల ఉన్న దుకాణదారులు బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకోకుండా సహకరించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. మంగళవారం బాలానగర్లోని మినర్వా గార్డెన్లో ఓనర్స్, మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతపాలకులు 2008లో 200ఫీట్ల వెడల్పుతో ప్లైఓవర్ నిర్మాణం కోసం మాస్టర్ప్లాన్ను రూపొందించారని గుర్తుచేశారు. నాటి పరిపాలకుల నిర్లక్ష్యంతో బ్రిడ్జినిర్మాణం చేపట్టలేకపోయిందని తెలిపారు. బాలానగర్ అతిపెద్ద పారిశ్రామికవాడ కావడంతో అధిక జనాభా ఉన్న ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే వాహనదారులు ట్రాఫిక్ సమస్యతో నరకయాతన పడవలసి వచ్చేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం రద్దీ ఉన్న ప్రాంతాలను గుర్తించి నూతనంగా ప్లైఓవర్ల నిర్మాణాలను చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే రూ.387 కోట్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం కోసం రోడ్ల విస్తరణలో భాగంగా ప్రధాన రహదారి వెంట కొన్నేండ్లుగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనభృతి పొందుతున్న వారికి దుకాణాల తొలగింపుకు ప్రభుత్వ ధరకంటే అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందుకు వ్యాపారులు, దుకాణదారుల యజమానులు మహానగర అభివృద్ది సంస్థ (హెచ్ఎంగీఏ), నగరపురపాలకసంస ్థ(జీహెచ్ఎంసీ)లకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు, డివిజన్ల కార్పొరేటర్లతోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తమకు న్యాయం చేయాలని బాధితుల మొర...
ప్లైఓవర్ నిర్మాణం పనుల్లో భాగంగా చేపట్టే రోడ్లవిస్తరణలో తమ వ్యాపార సముదాయాలను తొలగించే క్రమంలో సంబంధిత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు తమకు సరైన న్యాయం చేయాలని బాలానగర్ ఓనర్స్, మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొన్నేండ్లుగా ఈ స్థలాల్లో దుకాణాలు నిర్మించుకుని వ్యాపారాలు కొనసాగిస్తూ జీవనం వెల్లదిస్తున్నామన్నారు. అంతేగాక గత రోడ్డు విస్థరణలో భాగంగా కొంత స్థలాలను పోగొట్టుకుని నష్ణపోయమని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం 200ఫీట్ల వెడల్పుతో నిర్మించే బ్రిడ్జిని 120ఫీట్లకు కుదించి నిర్మాణం చేపట్టినట్లయితే దుకాణ యజమానుదారులకు, వ్యాపారస్తులకు నష్టం జరగకుండా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు బండారి ప్రకాష్గౌడ్, పులి శివకుమార్గౌడ్, దారం వెంకటేశంగుప్త, షేర్కాని లక్ష్మణ్, కంచి మహేందర్, పుష్పరాజ్, శ్రీకాంత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.