Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఉప్పల్
బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు అందించే చీరల పంపిణీపై ఉప కమిషనర్ యాదగిరిరావు పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సర్కిల్లో మొత్తం 54 రేషన్ షాపులు ఉన్నాయనీ, సెప్టెంబర్ 17,18,19 తేదీల్లో రెండు షాపులకు ఓ కమ్యూనిటీ హాల్ కేటాయించి చీరలను పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు ఒరిజినల్ను, జిరాక్స్ను అధికారులకు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ తహసీల్దార్ రమేష్కుమార్, దుర్గప్రసాద్, శ్రీనివాస్గౌడ్, ఈఈ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.