Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
సంస్కృతాంధ్ర భాషలలో అసమాన పాండిత్య ప్రతిభావంతుడు వేటూరి ప్రభాకర శాస్త్రి అని ద్రావిడ విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి ఆచార్య రవ్వ శ్రీహరి నివాళి అర్పించారు. శ్రీత్యాగరాయ గానసభలోని లలిత కళావేదికపై మంగళవారం ప్రఖ్యాత కవి పండితుడు వేటూరి ప్రభాకరశాస్త్రి వర్థంతి సభ జరిగింది.
ముఖ్య అతిథిగా ఆచార్య శ్రీహరి హాజరై మాట్లాడుతూ. అన్నమయ్య కీర్తనలను తాళపత్రాల నుంచి పరిష్కరించిన ప్రభాకర శాస్త్రి తెలుగు వారికి ఆయన కీర్తనలలోని మాదుర్యాన్ని అందజేశారని కొనియాడారు. సాహితీ వెత్త డాక్టర్ ద్వానాశాస్త్రి మాట్లాడుతూ. వేటూరి ప్రభాకర శాస్త్రి పీటికలు సాహిత్య విద్య నిధులని వివరించారు. తెలుగు వెలుగులు మీగడ తరకలు శృంగార శ్రీనాథం గ్రాంథాలు ఆయనను ఉన్నత విమర్శకునిగా నిరూపిస్తాయని విశ్లేషించారు. గానసభ అధ్యక్షులు కళాజనార్థనమూర్తి అధ్యక్షత వహించిన సభలో సాధన నరసింహాచార్య స్వాగతం పలికారు.