Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడ్మెట్
అల్వాల్ సర్కిల్లోని మూడు డివిజన్ల్లో వర్షానికి ధ్వంసమైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని లోక్సత్తా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ కె.శ్రీనివాస్వర్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ కాలనీలో ప్రధాన రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందనీ, కొద్ది రోజులుగా బాలుర పాఠశాల దగ్గర నుంచి ఆనంద్రావునగర్, జానకీనగర్, శ్రీనివాస్నగర్, వాసవినగర్ కాలనీలకు వెళ్లే అంతర్గత రోడ్లు చాలా ఇబ్బందులుగా ఉన్నాయ తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలంయావ్ పాల్గొన్నారు.