Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అంబర్పేట్
బస్తీల్లోని సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం బాగ్అంబర్పేట డివిజన్లోని బతుకమ్మకుంట, మల్లన్నస్వామి గుడి, గంగబౌలి, శాంతినగర్, రమణకేంద్రం, శ్రీనివాస్ స్కూల్, చెందుబస్తీ, వాంబేకాలనీల్లో అధికారులతో కలిసి ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించి.. పెద్ద సమస్యలపై ప్రతిపాదనలను సిద్దం చేసి తన దృష్టికి తీసుకువస్తే వాటికి కావల్సిన నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు చుక్క జగన్, సి.కృష్ణగౌడ్, పి.గోవర్దన్రెడ్డి, ఈ.అజరుకుమార్, ఎ.రమేష్, ఎన్.గిరి, జె.బాలరాజ్, ఈ.రఘునందన్, టి.వెంకటేశ్, డి.లక్ష్మణ్, టి.సుభాష్, డి.కృష్ణ, శేఖర్, ఈ.కృష్ణ, బాలు, సురజ్సింగ్, కె.శివరావు, డి.సాయన్న, శాతం సూరి, పి.కృష్ణగౌడ్, డి.వెంకటేష్, అధికారులు డీఎంసీ శ్రీనివాస్రెడ్డి, నిత్యానందం, రాజ, వెంకటేష్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.