Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరుతో కొనసాగుతున్న సురవరం ప్రతాప్రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్టుకు అధ్యక్షులుగా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఎన్నికయ్యారు. ఇటీవల ట్రస్టు తెలంగాణ సార స్వత పరిషత్తులో సమావేశమై ఇప్పటివరకు ట్రస్టు అధ్య క్షులుగా ఉన్న జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలి పారు. సురవరం సాహిత్య వైజయంతి ట్రస్టు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారిని, తెలుగు విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షులుగా ఆచార్య ఎస్వీ సత్య నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధా కర్రెడ్డిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. సురవరం ప్రతాపరెడ్డి కుమారులైన సురవరం రఘువర్థన్రెడ్డిని, విష్ణువర్థన్రెడ్డిని తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్డర్ జె.చెన్నయ్యను సంయుక్త కార్యదర్శులుగా ఎన్నుకున్నారు. సురవరం పుష్పలత కార్యదర్శిగా కొనసా గుతారు. ఆచార్య ఎస్వీ రామారావు, కొండా లక్ష్మీకాంతా రెడ్డి, ఎస్.మనోహర్రెడ్డి ఎస్.గిరిధర్రెడ్డి విశిష్ట సభ్యు లుగా ఎన్నికయ్యారు. సురవరం ప్రతాపరెడ్డి మరో కు మారుడు కృష్ణవర్థన్ రెడ్డి కోశాధికారిగా ఉంటారని సుర వరం సాహిత్య వైజంతి ట్రస్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.