Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్పేట్
సీపీఎస్ విధానం రద్దు చేయాలని జేఏసీ తల పెట్టిన తెలంగాణ ఉద్యోగుల నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.మమత, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ అన్నారు. మంగళవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నగర శాఖ కార్యాలయంలో టీటీఓ నగర అధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు. ఆగస్టు 30, నగరంలోని ప్రభు త్వ ఉద్యోగులందరూ గృహకల్ప భవన సముదాయంతో చేపట్టే ర్యాలీలో పాల్గొనాలని కోరారు. సెప్టెంబర్ 1వ ఎస్ఎస్సీ బోర్డు కార్యాలయంలో భోజన విరామ సమయంలో పెద్ద ఎత్తున నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక ఐక్యకార్యచరణ సమితి తరపున విజ్ఞప్తి చేస్తూ ఉద్యగులందరూ ఐక్యతతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు. సిటీబ్యూరో: సీపీఎస్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహి స్తామని హైదరాబాద్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు క్రిష్ణ యాదవ్ అన్నారు. ఖైరతాబాద్లోని వాటర్బోర్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం టీజీఓ అధ్యక్షులు వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ను రద్దుచేసి, ఓపీఎస్ను తీసుకురావాలన్నారు. వచ్చే నెల1న నిరసన కార్య క్రమాలు చేపడుతు న్నామని అన్నారు. ర్యాలీ ఉం టుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్బోర్డు జీఎంఎంఏ ఖాదర్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.