Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒత్తిళ్ల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం
- యాజమాన్యమే బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాల డిమాండ్
నవతెలంగాణ - దుండిగల్
బాచుపల్లి సమీపంలోని ప్రగతినగర్ నారాయణ కళాశాల క్యాంపస్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవ త్సరం చదువుతున్న నాగసాయి (17) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాద్ జిల్లా, బోదన్ మండలం, పంటకుదరురు గ్రామానికి చెందిన వంశీధర్ కుమారుడు నాగసాయి ప్రగతినగర్ నారాయణ రెసిడెన్షియల్ కళాశాల క్యాంపస్లో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కొద్దిరోజుల క్రితం నాగసాయితో పాటు మరో ముగ్గురు విద్యార్థులు కలిసి జూనియర్ విద్యార్థులను వేధిస్తూ ఉండటంతో కళాశాల ప్రిన్సిపాల్ నాగసాయి తండ్రి వంశీధర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. వినాయక చవితి పురస్కరించు కొని విద్యార్థులు ఇంటికెళ్లే సమయంలో మీ పేరెంట్స్ను కూడా తీసుకురావాలని నాగసాయికి ముందే ప్రిన్సిపాల్ తెలిపినట్టు సమాచారం. అయితే పండుగ సెలవు అనం తరం నాగసాయి ఒక్కడే ఇంటి నుంచి కళాశాలకు వచ్చాడు. అయితే పేరెంట్స్ను ఎందుకు తీసుకురా లేదనే విషయాన్ని ప్రిన్సిపాల్ అడిగారా..? లేదా ఇంకేదై నా మనస్థాపానికి గురయ్యాడా అనే విషయాలు పక్కన బెడితే, మంగళవారం తెల్లవారు జామున అందరిలాగే నాగసాయి నిద్రలేచి, కళాశాలకు రెడీ అయ్యి క్లాసుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అంతలోనే వడి వడిగా తన రూమ్కు వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డినట్టు సమాచారం. కళాశాల యాజమాన్యం పోలీ సులకు సమాచారం ఇవ్వడంతో బాచుపల్లి సీఐ బాల క్రిష్ణారెడ్డి నేతృత్వంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాగసాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందు కున్న నాగసాయి తల్లిదండ్రులు, బంధువులు హుటా హుటిన కళాశాలకు చేరుకొని కళాశాల ఎదుట ఆందో ళనకు దిగారు. నారాయణ విద్యా సంస్థల అధిపతి ఏపీ మంత్రి నారాయణ చిత్రపటాన్ని దహనం చేశారు.
నారాయణ సంస్థలను నిషేధించాలి : పీడీఎస్యూ
నారాయణ కళాశాలలో యాజమాన్యం వేధింపుల కార ణంగానే నాగసాయి ఆత్మహ త్యకు పాల్పడినట్టు పీడీఎస్ యూ హైద రాబాద్- రంగా రెడ్డి జిల్లాల ప్రధా న కార్యదర్శి పి.మహేష్ విమ ర్శించారు. కార్పొరేట్ కళాశాలలు ర్యాంకుల దాహానికి పాల్పడుతు న్నాయని తీవ్రంగా ఆరోపించారు. విద్యా ర్థులను జైలులో నిర్బంధించి నట్టు చదువు చెబుతున్నారని వాపోయారు. నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్య పరంపర రోజురోజుకు పెరుగు తున్నా... ప్రభుత్వం ఎందుకు చర్యలు తసుకోవడం లేదంటూ ప్రశ్నించారు.
నాగసాయి ఆత్మహత్యపై విచారణ జరపాలి : ఎస్ఎఫ్ఐ
నారాయణ విద్యార్థి నాగసాయి మరణంపై ప్రభు త్వం, పోలీసులు సమగ్రమైన విచారణ జరపాలని ఎస్ ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జావెద్ డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికి యాజమాన్యం ఒత్తిళ్లు కారణంగానే జరిగిందనీ, ఈ ఘటనకు యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల హామీలో చెప్పినట్టుగా నారాయణ లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలను తక్షణమే నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నవతెలంగాణ - దుండిగల్
బాచుపల్లి సమీపంలోని ప్రగతినగర్ నారాయణ కళాశాల క్యాంపస్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవ త్సరం చదువుతున్న నాగసాయి (17) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాద్ జిల్లా, బోదన్ మండలం, పంటకుదరురు గ్రామానికి చెందిన వంశీధర్ కుమారుడు నాగసాయి ప్రగతినగర్ నారాయణ రెసిడెన్షియల్ కళాశాల క్యాంపస్లో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కొద్దిరోజుల క్రితం నాగసాయితో పాటు మరో ముగ్గురు విద్యార్థులు కలిసి జూనియర్ విద్యార్థులను వేధిస్తూ ఉండటంతో కళాశాల ప్రిన్సిపాల్ నాగసాయి తండ్రి వంశీధర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. వినాయక చవితి పురస్కరించు కొని విద్యార్థులు ఇంటికెళ్లే సమయంలో మీ పేరెంట్స్ను కూడా తీసుకురావాలని నాగసాయికి ముందే ప్రిన్సిపాల్ తెలిపినట్టు సమాచారం. అయితే పండుగ సెలవు అనం తరం నాగసాయి ఒక్కడే ఇంటి నుంచి కళాశాలకు వచ్చాడు. అయితే పేరెంట్స్ను ఎందుకు తీసుకురా లేదనే విషయాన్ని ప్రిన్సిపాల్ అడిగారా..? లేదా ఇంకేదై నా మనస్థాపానికి గురయ్యాడా అనే విషయాలు పక్కన బెడితే, మంగళవారం తెల్లవారు జామున అందరిలాగే నాగసాయి నిద్రలేచి, కళాశాలకు రెడీ అయ్యి క్లాసుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అంతలోనే వడి వడిగా తన రూమ్కు వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డినట్టు సమాచారం. కళాశాల యాజమాన్యం పోలీ సులకు సమాచారం ఇవ్వడంతో బాచుపల్లి సీఐ బాల క్రిష్ణారెడ్డి నేతృత్వంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాగసాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందు కున్న నాగసాయి తల్లిదండ్రులు, బంధువులు హుటా హుటిన కళాశాలకు చేరుకొని కళాశాల ఎదుట ఆందో ళనకు దిగారు. నారాయణ విద్యా సంస్థల అధిపతి ఏపీ మంత్రి నారాయణ చిత్రపటాన్ని దహనం చేశారు.
నారాయణ సంస్థలను నిషేధించాలి : పీడీఎస్యూ
నారాయణ కళాశాలలో యాజమాన్యం వేధింపుల కార ణంగానే నాగసాయి ఆత్మహ త్యకు పాల్పడినట్టు పీడీఎస్ యూ హైద రాబాద్- రంగా రెడ్డి జిల్లాల ప్రధా న కార్యదర్శి పి.మహేష్ విమ ర్శించారు. కార్పొరేట్ కళాశాలలు ర్యాంకుల దాహానికి పాల్పడుతు న్నాయని తీవ్రంగా ఆరోపించారు. విద్యా ర్థులను జైలులో నిర్బంధించి నట్టు చదువు చెబుతున్నారని వాపోయారు. నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్య పరంపర రోజురోజుకు పెరుగు తున్నా... ప్రభుత్వం ఎందుకు చర్యలు తసుకోవడం లేదంటూ ప్రశ్నించారు.
నాగసాయి ఆత్మహత్యపై విచారణ జరపాలి : ఎస్ఎఫ్ఐ
నారాయణ విద్యార్థి నాగసాయి మరణంపై ప్రభు త్వం, పోలీసులు సమగ్రమైన విచారణ జరపాలని ఎస్ ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జావెద్ డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికి యాజమాన్యం ఒత్తిళ్లు కారణంగానే జరిగిందనీ, ఈ ఘటనకు యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల హామీలో చెప్పినట్టుగా నారాయణ లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలను తక్షణమే నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.