Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
తెలంగాణ గ్రామీణ జీవితపు గుండె చప్పుడును నందిని సిద్ధారెడ్డి నాగేటి చాలు కవిత ప్రస్పుటించిదని తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నారు. శ్రీత్యాగరాయ గానసభలో మంగళవారం తెలంగాణ భాష సాంస్కృతిక పర్యాటక శాఖ, సౌజన్యంతో తంగేడు పూలు మాస పత్రిక ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులుగా నియుక్తులైన డాక్టర్ నందిని సిద్దారెడ్డికి ఆత్మీయ సత్కారం తెలంగాణ జానపద గీతాలు భోనాల సంబురాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి పాల్గొని మాట్లాడుతూ. తంగేడు పూలు భూదేవి పెట్టుకున్న ఆభరణమని ఆ పేరుతో పత్రిక రావడం ఆనందకరమన్నారు. సిద్ధారెడ్డి విభిన్న ముఖీనుడని కవి విమర్శకుడు అధ్యాపకుడు, పరిశోధకుడు మించి అందరికీ ఆత్మీయుడన్నారు. గతంలో సాహిత్య అకాడమీ తెలుగు రాష్ట్రాల్లో లేనందున కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ గ్రాటు నష్టపో యామన్నారు. తెలుగు భాషకు ప్రత్యేకించి తెలంగాణ సాహిత్యానికి మంచి రోజులు వచ్చాని సిద్ధారెడ్డి అకాడమీ అధ్యక్షులు కావడం శుభసూచికమన్నారు. ప్రముఖ కవి నాలేశ్వరం శంకరం మాట్లాడుతూ. సిద్ధారెడ్డి కవిత్వం విప్లవోద్యమం, తెలంగాణ ఉద్యమం రెండూ ముఖాలుగా ఉందని వివరించారు. బాలుని ఆత్మగీతంలో ఆయన శ్రా మికుల శ్రమైక జీవినాన్ని వ్యక్తం చేశారన్నారు. సత్కార గ్రహీత నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ. పూలదండలు, శాలువాలకన్న తాను మనిషిణి అభిమానిస్తామన్నారు. మనిషి ఉన్నతికి ఎదిగించేందుకు కవిత్వాన్ని సాధనగా ఎంచుకున్నామన్నారు. తెలంగాణ పండుగలు స్వామూ హికంగా జరుపుకుంటారని అక్షర బలం, ఆత్మ బలం, తె లంగాణను, బంగారు తెలంగాణగా మారుస్తా యన్నారు.
మనోహరంగా హరితహారం
ఈ సందర్భంగా సాంస్కృతి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వ ర్యంలో కుప్ప పద్మజ నృత్యదర్శకత్వంలో తేజస్వితి బృందం ప్రదర్శించిన హరితహారం నృత్య రూపకం ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. సతీష్, సైదులు, భూలక్ష్మి పాడిన జానపద గీతాలు కళాకారులు ప్రదర్శించిన భోనాల సంబరాలతో గానసభ ప్రతిధ్వనించిందిన సంస్థ నిర్వాహకుడు రాఘవ కార్యక్రమాని పర్యవేక్షించారు.