Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండ్లలోకి వస్తున్న వర్షపు నీరు
- మా గోస పట్టించుకునే నాథుడే లేడు
- రోడ్లపై గోదావరి ప్రవహిస్తున్న వైనం
- పట్టించుకోని పాలకులు, అధికారులు
వర్షకాలం వచ్చిందంటే ముంపు ప్రాంతాల వాసుల గుండెల్లో రైళ్లు పరిగేడుతుంటాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలలో అభివృద్ధికి అమడదూరంలో ఉన్నదన్నడంలో అతిశయోక్తికాదు. పాలకుల నిర్లక్ష్యమో, అధికారుల పాపమో తెలియదు కానీ వీధులు గోదావరిలా తయారవుతున్నాయి.
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
చింతల్ డివిజన్ దోబీఘాట్లో, రంగారెడ్డినగర్ డివిజన్ విజయనగర్ కాలనీలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనవాసాల మధ్య వర్షపు నీరు చెరి రోడ్లుపై గోదావరి నదిలా ప్రవహిస్తు ఇండ్లలోకి చేరుతుంది. దీంతో వంట వార్పు లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని దోబీఘాట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగర్ కాలనీలో జనవాసాల మధ్య రెండు అడుగుల లోతు నీరు స్తంభించిపోయి పూర్తిగా కొన్ని వీధులు బురదమయంగా మారిపోయాయి. ఇండ్లలోకి సైతం నీరు రావడంతో భయం భయంతో కాలాన్నీ వెలదీస్తున్నామని వాపోయారు. లక్షలు ఖర్చుపెట్టి ఇండ్లు కట్టుకున్న తమకేమి సుఖం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షకాలంలో బంధువులు ఎవరూ మా ప్రాంతానికి రారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితి ఇలా ఉంటే అధికారులు పట్టించుకోవడం లేదు. ఏ మేము ట్యాక్స్ కడుతలేమా అని అధికారులను ప్రశ్నించారు. పెద్దలు నివసించే కాలనీలకు ఇచ్చే ప్రాధాన్యత పేదలు నివసించే ముంపు, మురికివాడ ప్రాంతాలకు ఎందుకు ఇవ్వరని మండిపడ్డారు. దశాబ్దన్నర కాలంగా తాము వర్ష కాలంలో నిత్య నరకం అనుభవిస్తున్నామన్నారు. విజయనగర్ కాలనీలో సుమారు 10 నుంచి 15 ఇండ్లు ఇంటి అరుగులు పూర్తిగా మునిగిపోయి నడవడానికి వీలు లేకుండ మడుగులా తయారయ్యాయి. అది చూస్తుంటే ఒక సందర్భంలో చెరువును తలపించే విధంగా ఉంటుందన్నారు. వర్షపు నీరు స్తంభించి దొమలు, ఈగలు వ్యాప్తిచెంది అనారోగ్యాల పాలవుతున్నామని కాలనీవాసులు వాపోయారు. పందులు, కుక్కలు వర్షపు నీటిలో స్థైర విహారం చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు మొద్దు నిద్ర వీడి తమ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ఆయా ప్రాంత వాసులు కోరుతున్నారు.
సగం సంపాదన ఆస్పత్రులకే
ఉదయం నుంచి సాయం త్రం వరకు ల్యాండ్రి షాపు లో ఇస్త్రీ చేసు కుంటూ కుటుం బాన్ని పోషించుక ుంటున్నా. పైసా పైసా కూడబెడితే అందులో సగం ఆస్పత్రులకే ఖర్చు చేయాల్సి వస్తుంది. రోడ్లు, డ్రెయినేజీ సక్రమంగా లేకనే మాకు ఈ పరిస్థితి వర్షకాలంలో సంభవిస్తుంది. భారీ వర్షాలు వస్తే మా బతుకులకు భరోసా లేదు. అధికారులు తక్షణమే స్పందించాలి.
అండాలమ్మ, విజయనగర్ కాలనీ వాసి
మా మీద ఎందుకు చిన్న చూపు
ఏండ్ల నుంచి ట్యాక్స్లు, ఇతర ఖర్చు పెడుతున్నా వసతులు కల్పించడంలో అధికారులు ఎందుకు విఫలమవుతున్నారు. మా ప్రాంతాల మీద ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు. పెద్దలు ఉద్యోగాలకు, పిల్లలు పాఠశాలలకు వెళ్ళకుండా వర్షం వస్తే ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. పెద్ద వర్షం వస్తే మా సామాన్లు నీటిలో తేలుతుంటాయి. మమ్మల్ని కూడా మనుషుల్ల గుర్తించండి.
పున్నం యాకయ్య, దోబీఘాట్ వాసి