Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మూషక్ మహాల్
- పట్టించుకోని పురవాస్తు అధికారులు
నవతెలంగాణ-ధూల్పేట్
చారిత్రక కట్టడానికి అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం..హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించిన నిజాం వారసత్వ చిహ్నాంగా నిలిచిన కట్టడం నేడు శిథిలావస్థకు చేరుకుంది. గొల్కొండ ఫొర్ట్కు సమీపంలోనే ఉన్నా తన ఉనికిని బాహ్యా ప్రపంచానికి దూరంగా ఉండిపోయింది. చారిత్రక ఆనవాళ్లు ఉన్నా అధికారుల ఆదరణకు నోచుకోకపోవడంతో స్థానిక ప్రాంతానికే పరిమితమైంది.
మూషక్ మహల్
నాటి నగర నిర్మాణానికి అంకురార్పణ చేసిన ఖులీ ఖుతుబ్ షా వంశంలో చివరి రాజైన అబ్దుల్ హసన్ తానేషా ఈ మూషక్ మహల్ను 1678లో నిర్మాణం చేపట్టారు. అబ్దుల్ హసన్ తానేషా వద్ద సైన్యాధ్యక్షుడిగా విధులు నిర్వహించిన మియాన్ మిషక్ మాలిక్ విశ్రాంతి భవనంగా ఏర్పాటు చేశాడు. గొల్కొండ కోటకు సమీపంలోని అత్తాపూర్ నాడు అడవిలా విస్తరించి ప్రశాంత వాతవరణం వెదజల్లుతుండగా అక్కడ నివాసానికి నెలవైన భవనాన్ని నిర్మించాలనుకున్నాడు. వెంటనే తన ఆదేశాలతో అనతి కాలంలోనే అపురూపమైన వాస్తు శిల్పాలతో అబ్దుల్ హసన్ కోరిక మేరకు స్థలాన్ని కేటాయించడంతో అత్తాపూర్లోని ఎత్తైన కొండపై వేసవి విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది వేసవి కాలం ముగిసే వరకు అబ్దుల్ హసన్ తానేషా మూషక్ మహల్ విడిది కేంద్రం నుంచే పరిపాలన సాగించే వారు
మసకబారుతున్న చారిత్రక ఆనవాళ్లు
ప్రస్తుతం మూషక్ మహల్ కళా విహీనంగా మారిపోతుంది. చారిత్రక సందపకు అధికారుల నిర్లక్ష్యం చెదపట్టింది. ఒకప్పుడు రాజ కుటుంబాలతో కళకళలాడిన ఈ మహల్ నేడు ఆదరణకు నోచుకోక పోవడంతో శిథిలావస్థకు చేరింది. దీంతో ఒకప్పుడు అందమైన కట్టడంతో స్థానిక గుర్తింపుతో పాటు చారిత్రకకు సజీవ సాక్ష్యంలా నిలిచిన మూషక్ మహల్ ప్రస్తుతం కళావీహినంగా మారిపోయింది.
అసాంఘిక కార్యకలపాలకు అడ్డగా
ప్రస్తుతం చీకటి పడితే చాలు మద్యం బాబులు తమకు అనువైన ప్రాంతంగా మలుచుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకునేవారు లేకపోవడంతో మందుబాబులు ఇష్టానుసారంగా తమ విడిదిగా మార్చుకున్నారు. ఒకప్పుడు రాజుల కుటుంబాలకు నెలవుగా ఉన మూషక్ మహల్లో నేడు మందుబాబుల సేద తీరుతున్నారు. దానితో పాటు వరుసగా ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి దారుణంగా హత్యలు చేస్తున్నారు. మహల్ గత చరిత్ర ఎంత ఘనం కలిగిన ఈ భవనం ప్రస్తుతం బూత్ బంగ్లాలా మారిపోయింది. చారిత్రక ఆనవాళ్లు కలిగిన ఈ మహాల్ను పరిరక్షించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.