Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్చరర్రిపోర్టర్
కవి లక్ష్యం నిరంతరం సామాజిక చింతనే కావాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ అన్నారు. యువ కళావాహిని ఆధ్వర్యంలో రవీంధ్ర భారతీలోని సమావేశ మందిరంలో గురువారం బీఎన్ సాహితీ పురస్కార ప్రదానోత్సవం సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ రమణ పాల్గొని పురస్కారాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డికి బహుకరించి మాట్లాడారు. బీఎన్రెడ్డి నాలుగు వ్యాక్యాల్లో సామాజిక అంశాలను సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యే రీతిలో అందిం చారన్నారు. సిధారెడ్డి అభ్యుదయ భావకుడుగా కవిత్వాన్ని సమాజిక చైతన్యా నికి ఎంచుకున్నారని అభినందించారు. పారిశ్రామికవేత్త సారిపల్లి కొండల్ రావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ బీఎన్రెడ్డి భవన నిర్మాతగా, వాస్తు శిల్పిగా పేరు గడించిన కవిత్వమే ఆయన ఇష్టమైన అంశమని వివరించారు. దూరదర్శన్ పూర్వ సంచాలకులు డాక్టర్ పీ మధుసూదన్రావు, తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపాధ్యక్షులు ఆచార్య హన్మండ్ల భూమ య్య, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కళపత్రికా సంపాదకుడు మహ్మద్ రఫీ పాల్గొన్న సభకు వైకే నాగేశ్వర్రావు స్వాగతం పలికారు.