Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
వ్యర్థనీరు పునర్వినియోగంపై ప్రజల్లో అవగాహాన కల్పించాలని వాటర్బోర్డు ఎండీ ఎం.దానకిషోర్ అన్నారు. ఇండియా వాటర్ ఆధ్వర్యంలో అబిడ్స్లోని రాయల్టన్ హోటల్ లో నిర్వహించిన టెక్నాలజీ మీట్ అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సూటబుల్ సోలుషన్స్ అఫ్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ రీసైక్లింగ్ అనే అంశంపై నిర్వహించిన సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటర్బోర్డు సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం తిరిగి వ్యర్థనీరుగా డ్రైనేజీలో కలుస్తు న్నాయని తెలిపారు. గృహ సంబంధ వ్యర్థ నీరు వృథాగా మూసీ నదిలో కలుస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే 700 ఎమ్ఎల్డీల వ్యర్థనీటిని ఎస్టీపీల్లో శుధ్దిచేసి పునర్వియోగానికి అందుబాటులో ఉన్నా యన్నారు. ఈ శుద్ది చేసిన నీటిని పునర్విని యోగించేలా ప్రజల్లో అవగాహాన కల్పించాలన్నారు. శుధ్ద వ్యర్ధనీరు వినియోగంలో ప్రజల ఆలోచన విధా నంలో మార్పు తీసుకువచ్చేలా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం కూడా మురుగునీటి పునర్వి నియోగానికి కసరత్తు ప్రారంభించిందని తెలిపారు. అందరం కలిసి నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలు దేశాల్లో నీటి సరఫరా, నిర్వహణ కొరకు పలు రాకల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని తెలిపారు. ఇప్పటికే పలు దేశాలు చెందిన పలు కంపెనీలు ఈ సమస్యలకు టెక్నాలజీ పరంగా పరిష్కారం చూసిస్తామని ముందుకు వచ్చాయని తెలిపారు. అయితే అందులో పలు టెక్నాలజీలను క్షేత్రస్థాయిలో వినియోగించగా అనుకున్నంత మేర విజయవంతం కాలేదన్నారు. అలాగే వీటి నిర్వహణ వ్యయం చాలా అధికంగా ఉందని తెలిపారు. ఈ సమస్యలకు పరిష్కారాన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే, తక్కువ ఖర్చుతో జరిగేలా చూడాలని కోరారు. నెగరంలో 1920 నుంచే తాగునీటి సరఫరా వ్యవస్థ,మురుగునీటి పారు దల వ్యవస్థ అందుబాటులో ఉండేదని తెలిపారు. దాదాపు 200 కిమీల నుంచి కృష్ణా, గోదావరి నుంచి వెయ్యి లీటర్ల నీటిని రూ. 45 వెచ్చించి నగరానికి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఆ నీటినే దాదాపు రూ.8 రూ లకు సబ్సీడీపై నగరవాసులకు అందిస్తు న్నామని వివరించారు. నగరంలో సరఫరా చేస్తున్న నీటిలో లెక్కలోకి రాకుండా పోతున్న(నాన్ రెవెన్యూ వాటర్) నీరు అధికంగా ఉందన్నారు. లెక్కలోకి రాకుండా పోతున్న నీటిని గుర్తించేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నామని అన్నారు. అనంతరం టెక్నికల్ డైరెక్టర్ డా. సూర్యనారాయణ జలమండలి లో సాంకేతి పరిజ్ఞానం అమలు చేస్తున్న బిల్లింగ్, మొబైల్ అప్స్ ఆన్లైన్ సేవలు తదితర సేవలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించారు. ఈ సెమి నార్లో డా.ఎస్. సత్యనారాయణ, రెవిన్యూ డైరెక్టర్ విజరుకుమార్రెడ్డితో పలు ప్రయివేటు సంస్థల ప్రతినిథినిధులు తదితరులు పాల్గొన్నారు.