Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బ్దుల్లాపూర్మెట్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ ఎన్నికల పరిశీలకులు నోముల కృష్ణగౌడ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం గ్రామ పంచాయతీ పరిధి లోని పద్మావతి ఫంక్షన్ హాల్లో బాటసింగారం, పిగ్లి పూర్ గ్రామశాఖల అధ్యక్షులు నార్లకొండ వెంకటేష్ యాదవ్, ఆకుల ధన్రాజ్గౌడ్ల ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కృష్ణగౌడ్ హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామంలోని ఇంటింటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శవంతంగా నిలుస్తున్నాయని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఫించన్లు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రజల్లో ఆధారణ పొందుతు న్నాయని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని దీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దఅంబర్పేట మున్సి పాలిటీ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు అనంతుల వెంకటేశ్వర్రెడ్డి, కార్యదర్శి పాశం దామోదర్, బాటసింగారం మాజీ సర్పంచ్ నోముల జగదీశ్వర్, అబ్దుల్లాపూర్మెట్ మండల పార్టీ అధ్యక్షుడు కొత్త కిషన్గౌడ్, సీనియర్ నాయకులు చక్రవర్తి, బలదే వారెడ్డి, జంగయ్య యాదవ్, పారంద దామోదర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.