Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఫీసు ముందు ప్రజల పడిగాపులు
నవతెలంగాణ - చంపాపేట
టైమ్ ఉదయం 11 అయినా తహసీల్దార్ కార్యాలయం గది తలుపులు తెరుచుకోవు. అధికారుల రాక కోసం ఎదురు చూస్తూ ప్రజలు కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్నారు. కార్యాలయంలో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, స్కీమ్లకు అర్జీలు పెట్టుకు నేందుకు, ఎప్పుడో అర్జీలు పెట్టుకున్న వారు ఎందుకు పెండిగ్లో ఉన్నాయే సమాచారం అడిగి తెలుసుకు నేందుకు, కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం అర్జీలు పెట్టుకున్న వారు కార్యాలయం ముందు అధికారుల రాకకోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. మండల రెవెన్యూ కార్యాలయాల విధి, విధానాల నిర్వ హణలో మార్పులు తీసుకురావాలి. మండల కార్యాల యాల్లో పలు స్కీమ్ల కోసం ప్రజలు పెట్టుకునే అర్జీలేవి పెండింగ్లో ఉండకూడదు. సకాలంలో పూర్తి కావా లంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నప్పటికీ సైదాబాద్ మండలంలో ఆ దిశగా పనులేవి కొనసాగుతున్నట్టు కనిపించటంలేదని ప్రజల ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయ నిర్వహణ పనులు ఈ విధంగా కొనసా గుతున్న పరిస్థితి ఉందంటే, కనీసం అధికారులు టైమ్కైనా కార్యాలయానికి వస్తారా అంటే అది కూడా కష్టమే. గురువారం ఉదయం 11 గంటల సమయం దాటినా తహసీల్దార్ ఆఫీస్ గది తలుపులు కూడా తెరుచు కోలేదు. వారు అప్పటి వరకు కూడా విధులకు హాజరు కాలేదు. అంత సమయం వరకు తహసీల్దార్ రాలేదంటే ఉప తహసీల్దార్ గదిలోని కుర్చీ కూడా ఖాళీగానే ఉంది. ఆ గది తలుపులు కూడా అప్పటి వరకు పూర్తిగా తెరవ లేదు. కార్యాలయ సిబ్బంది మాత్రం అప్పుడప్పుడే ఒకరి తరువాత ఒకరు నిధానంగా విధులకు వస్తున్నారు. ఈ కార్యా లయంలో విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి టైమ్ సెన్స్ ఉన్నట్టుగా కనిపించడం లేదు.