Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గచ్చిబౌలి
తల, మెడ, గొంతు క్యాన్సర్పై సమరం చేస్తున్నా మని, ఇందులో భాగంగానే ప్రతి నెల రెండో, నాల్గో శుక్రవారాల్లో తమ ఆస్పత్రిలో ఉచిత పరీక్షా శిబిరాలను నిర్వహిస్తున్నామని డాక్టర్ రావూస్ ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ ఇంటర్నేషనల్ ఆస్పత్రి చైర్మెన్ డాక్టర్ జీవీఎస్.రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన భారతీయుడు ఆమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ డాక్టర్ శశికాంత్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహి స్తారని వివరించారు. ఈ శిబిరంలో పరీక్ష చేయించుకున్న వారికి ఇంకేమైనా అవసరం ఉంటే 50 శాతం రాయితీపై పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం 040-45689999 నెంబర్ను సంప్రదించాలి.