Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశీలించిన మేయర్ రామ్మోహన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెత్త సేకరణకుగాను ఉపయోగించే బ్యాటరీతో నడిచే ఆటో ట్రాలీలను నగర మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా డీజిల్తో నడిచే స్వచ్ఛ ఆటోట్రాలీల స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోట్రాలీలను దశల వారీగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం జీహెచ ్ఎంసీని ఆదేశించింది. ఇందుకుగాను బ్యాటరీతో నడిచే ఆటోను జీహెచ్ఎంసీ కార్యాలయంలో పరిశీలించారు. దాదాపు రెండు మెట్రిక్ టన్నుల గార్బెజ్ను తరలిం చేందుకు వీలుగా ఈ బ్యాటరీ ఆటోను రూపొం దించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయడంతో పాటు హైడ్రాలిక్ విధానంలో ఉన్న ఆటోను పరిశీలించారు.
ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ తాజాగా ఎలక్ట్రిక్ ఆటోట్రాలీలను ప్రయో గాత్మకంగా చార్మినార్లో ప్రవేశపెట్టనున్నది. దీనిలో భాగంగా త్వరలోనే బ్యాటరీ (ఎలక్ట్రిక్) స్వచ్ఛ ఆటోలను నగరంలో ప్రవేశపెట్టనున్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.