Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ కేంద్రమంత్రి జైపాల్రెడ్డి
నవతెలంగాణ - తుర్కయంజాల్
రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి అన్నారు. గురువారం తుర్క యంజాల్ సర్పంచ్ కొత్తకుర్మ మంగమ్మశివకుమార్ నివాసంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దొరల పాలన నడుస్తుందన్నారు. రాబోయే 2019 ఎన్నికల్లో దొరల పాలనకు చరమగీతం పాడాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ తెలంగాణ కలను సాకారం చేసిందని, కానీ అధికారం మాత్రం కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్నదన్నారు. తెలంగాణ ప్రజలు త్వరలోని కుటుంబ పరిపాలనకు చరమగీతం పాడు తారని జోస్యం చెప్పారు. ఆయనతోపాటు సర్పంచ్ కొత్తకుర్మ మంగమ్మ, నాయకులు శివకుమార్ తదితరులు ఉన్నారు.
శ్యాంప్రసాద్రెడ్డిని పరామర్శించిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి...
తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాదరెడ్డి రెండో కుమారుడు విపిన్ చంద్రారెడ్డి(42) గుండెపోటుతో ఈనెల 17న ఆదివారం హఠన్మరణం చెందిన సంఘటన విధితమే. గురువారం అబ్దుల్లాపూర్మెట్ మండలం రాగన్నగూడ గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మి టౌన్షిప్ కాలనీలోని శ్యాంసుందర్రెడ్డి నివాసానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి చేరుకుని విపిన్చంద్రారెడ్డి చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఆయనతో పాటు తెలంగాణ జల వనరుల అభివృద్ధి శాఖ చైర్మెన్ ప్రకాష్, స్థానిక నాయకులు కొత్తకుర్మ శివకుమార్, కుంట గోపాల్రెడ్డి, బొగ్గు శ్రీను, తదితరులు శ్యాం ప్రసాద్రెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.