Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఎల్బీనగర్
ఉచిత వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నాగోల్ కార్పొరేటర్ చెర్కు సంగీతాప్రశాంత్గౌడ్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని బ్లైండ్స్ కాలనీలో మేడ్చల్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సంగీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడ్డ పేదల కోసం ఉచితంగా వైద్య సేవలందించడంతో పాటు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆపోహలు తొలగించుకుని వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఉమాదేవి, అంజమ్మ, వెంకట్రెడ్డి, కాలనీ వాసులు వరలక్ష్మి, శోభారాణి, జానాబాయి, డాక్టర్ సౌందర్య పాల్గొన్నారు.