Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బడంగ్పేట్
యోగా సర్వరోగ నివారిణి అని ఆవేర్ సంస్థ చైర్మెన్ మాధవన్ అన్నారు. గురువారం బడంగ్పేట మున్సిపాలిటీ పరిధిలోని నాదర్గుల్ గ్రామంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ యోగాను ప్రపంచ యోగా దినోత్సవంగా ఏర్పాటు చేయటం ఎంతో హర్షణీయమన్నారు. యోగా దినోత్సవంలో ప్రపంచంలోని 149 దేశాలు పాల్గొంటున్నాయని తెలిపారు. యోగా చేయటం వల్ల మానవులకు ఎలాంటి రోగాల బారినపడే అవకాశం లేదని తెలిపారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యారులు యోగాలో 4139 మంది పాల్గొని ఏసీయన్ బుక్ ఆఫ్ రికార్డు సాధించటం ఎంతో గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మెన్ కుమరయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, డ్రైరెక్టర్ శ్రీకాంత్, యోగా శిక్షకురాలు డాక్టర్ తేజస్విని, పీఆర్ఓ రాబిన్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.