Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
నవతెలంగాణ - సిటీబ్యూరో
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరువర్గాల మధ్య మత విధ్వేశాలు రెచ్చ గొడుతోందని, అంతేకాకుండా ముస్లింలు, దళితులపై విషయం కక్కుతూ పాశవిక దాడులకు, హత్యలకు పాల్పడుతోందని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. గురువారం దారుసలాంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్నో పాస్పోర్టు కార్యాలయంలో ఓ ప్రేమ జంటకు జరిగిన అవమానంపై అసదుద్దీన్ గురువారం స్పందించారు. ఓ ప్రేమ జంట వివాహం చేసుకుంటుంటే రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే ఓ ప్రభుత్వధికారి సిగ్గు లేకుండా వారిని కులం ఏదని ప్రశ్నించే పరిస్థితులు తలెత్తాయన్నారు. ప్రేమ జంట ఏ వర్గానికి చెందినదైనా వారిద్దరూ ఇష్టపడితే వారికి చట్టం ప్రకారం పెండ్లి జరిపించాల్సిన అధికారి మీ కులం ఏమిటని ఇద్దని ప్రశ్నించి అవమాన పరిచాడని, ఓ ప్రభుత్వ అధికారియై ఉండి ప్రేమ జంటకు కులం పేరు అడిగే హక్కుల ఎక్కడిదని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఇంకోవైపు సంఫ్ు పరివార్ కార్యకర్తలు గోరక్షక్ పేరిట ముస్లింలు, దళితులను ఊచకోత కోస్తున్నారని, అనేక చోట్ల దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.