Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఉస్మానియా యూనివర్సిటీ
మహిళా విద్యావేత్త, నర్తకి, కవయిత్రి, బహు ముఖ ప్రజ్ఞాశాలి అయిన మహాలఖాబాయిచందా పేరుపై రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీని నెలకొ ల్పాల్సిన అవసరముందని తెలంగాణ హిస్టరీ గ్రాడ్యు యేట్స్ అసోసియేషన్ తీర్మాణించింది. గురువారం ఓయూ గెస్ట్హౌస్లోని మిని కాన్ఫరెన్స్హాల్లో ప్రొఫెసర్ ఆడపా సత్యనారాయణ అధ్యక్షత టీహెచ్జీఏ ఆధ్వర్యంలో 'మహాలఖాబాయిచందా' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బివి. పాపారావు మాట్లాడుతూ మహాల ఖాబాయి గొప్ప దాతృత్వం ఉన్న వ్యక్తి అని కొని యాడారు. ఆమె పేరుపై ప్రతి ఏటా యాన్వెల్ కల్చరల్ ఫెస్టివల్తోపాటు ఒక సదస్సును నిర్వ హించాలని ఓయూ వైస్చాన్స్లర్ను కోరారు. అంతే కాకుండా ఆమె పేరుపై ఓ ట్రస్టును స్థాపించాల న్నారు. ఓయూలో ఏదైన నిర్మాణానికి ఆమె పేరు పెట్టాలన్నారు. ఎమ్రోరు యూనివర్సిటీ ప్రొఫెసర్ స్కాట్ కుగ్లీ మాట్లాడుతూ మహాల ఖాబాయికి చెంది న భవనాన్ని, సమాధిని సంరక్షించి భావితరాలకు తెలియజేసేలా చూడాలన్నారు. ఇఫ్లూ యూని వర్సిటీలో నేడు ఉన్న మెట్ల బావి ఆమె నిర్మించేదేనని గుర్తుచేశారు. ఓయూ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ రామ చంద్రం మాట్లాడుతూ ఓయూకు భూమిని దానం చేసిన గొప్ప వ్యక్తి ఆమె అని కొనియాడారు. ఆమె పేరుపై ఓ ప్రాజెక్టు ప్రపోజల్ను తీసుకొస్తే తాము తప్పకుండా సహకరిస్తామని, అది మా బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి మాట్లాడుతూ మహాల ఖాబాయి సేవల స్ఫూర్తి నేటి సమాజానికి ఉండా లన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రామకృష్ణ, ప్రొఫెసర్ సుదర్శన్, వీక్షణం ఎడిటర్ ఎన్. వేణు గోపాల్రావు, ఫ్రొపెసర్ సుధారాణి డాక్టర్ లావణ్య, డాక్టర్ అంజయ్య, రీసెర్చ్ స్కాలర్స్ డేవిడ్, రవీందర్, చెన్నబసవయ్య పాల్గొన్నారు.