Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గచ్చిబౌలి
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మేయిన్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లు, సీసీఎస్, ఎస్ఓటి, సైబర్క్రైమ్, విభాగాలకు చెందిన 75 మంది పోలీసులకు నూతన సాంకేతికతపై శిక్షణ ఇచ్చారు. అంతర్జాలంలో ఉచితంగా లభించే డేటా ఆధారంగా వ్యక్తులను, సంస్థలను గుర్తించే విధానాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సామాజిక మాద్యమాల్లో నేరస్తులను ఎలా గుర్తించాలి, మార్పింగ్ కొత్తగా వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుని నేరస్తులను కట్టడి చేయడం వంటి అంశాలపై కూడా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారి నుంచి ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సైబరాబాద్ కమిషనర్ విసి.సజ్జనార్ను కలిశారు. ఈ సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజరుకుమార్, క్రైమ్ డీసీపీ డాక్టర్ జానకిషర్మిలా, షీటీమ్స్ డీసీపీ అనుసూయ, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.