Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్న ఏపీఎన్జీవోస్ నేత ఆశోక్బాబు పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భాగ్యనగర్ టీఎన్జీవోస్ మహిళా ప్రతి నిధులు జాయింట్ సెక్రెటరీ రషీదా బేగం, ఎస్. సంధ్యరాణిలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురు వారం నారాయణగూడలోని బీటీఎన్జీవోస్ కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల ఏపీఎన్జీవోస్ భవన్లో బీటీఎన్జీవోస్ అధ్యక్షులు ఎం.సత్యనారాయణగౌడ్, మహిళా ఉద్యోగులపై దాడి చేసినట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఏపీఎన్జీవోస్ అధ్య క్షులు ఆశోక్బాబు చంద్రశేఖర్రెడ్డి, బాబుజీ తది తరులు బీటీఎన్జీవోస్ మహిళా ప్రతినిధులు అని కూడా చూడకుండా బెదిరించారని చెప్పారు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు లారీలతో తొక్కిస్తానని హెచ్చరికలు జారీ చేసినట్టు ఆరోపించారు. పీఓడబ్ల్యూ నాయ కురాలు సంధ్యను ఏపీిఎన్జీవోస్కు సంబంధించిన కొందరు ప్రతినిధులు తప్పుదోవ పట్టించి బీటీఎన్జీ వోస్ నేతలపై తప్పుడు వార్తలు రాయించారని ఆరోపి ంచారు. ఈ విషయంపై పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్యను కలిసి పూర్తి వివరాలు తెలియజేయనున్నట్టు తెలిపారు. మహిళా ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడుతున్న ఆశోక్బాబు, చంద్రశేఖర్రెడ్డిలపై అబిడ్స్ పోలీస్స్టేషన్లో కేసు పెట్టినట్టు తెలిపారు. తెలంగాణ ఉద్యోగులకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీటీఎన్జీవోస్ మహిళా ప్రతినిధులు సి.రమాదేవి, బి.రామదేవి, జి.సువర్ణ, నిర్మలాదేవి, సుశీలాదేవి, ఎ.సరళాదేవి, జె.జయశ్రీ, ఆర్.సరోజ, అమరజ్యోతి, ఉషాదే పాల్గొన్నారు.