Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ కలెక్టర్ ఎంవీ. రెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ఓటరు నమోదు కార్యక్రమాన్ని అధికారులు బాధ్యతయుతంగా నిర్వహించాలని కలెక్టర్ ఎంవీ.రెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మండలాల వారీగా ఓటరు నమోదు పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమంలో ఎటువంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రత్త వహించాలన్నారు. జూలై మొదటివారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరగా పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరికరణపై అధికారులతో చర్చించారు. హెచ్ఎండీఏ పరిధిలోని 10 చెరువులు, జీహెచ్ఎంసీ పరిధిలోని 20 చెరువులు సర్వేపూర్తి చేశామని ఇరిగేషన్ అధికారలు తెలిపారు. ఏడీ సర్వే ల్యాండ్స్, ఆర్డీఓ, ఇరిగేషన్ అధికారులు జేసీ సమన్వయంతో దీనిపై పూర్తి నివేదికను త్వరలో తయారుచేసి సంబంధిత అధికారులకు పంపించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ డి.శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీఓ విజయకుమారి, ఇరిగేషన్ డీఈ మంజులా, ఆర్డీఓలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ తదితర అధికారులు పాల్గొన్నారు.
దేశ సంస్కృతి, సాంప్రదాయాల్లో యోగా ఒక భాగం
ఘట్కేసర్ రూరల్
మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో యోగ ఒకటని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ అనురాగ్ విద్యాసంస్థల్లో గురువారం యోగా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై యోగా ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం యోగా గురువు సుధాకర్ రావును సన్మానించారు. యోగా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కార్యదర్శి నీలిమ, డైరెక్టర్ కె.ఎస్.రావు, అసిస్టెంట్ డైరెక్టర్ విష్ణుమూర్తి, తహసీల్దార్ పద్మప్రియ, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ మల్లేష్, నవీన్ పాల్గొన్నారు.