Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అమీర్పేట
మూడు నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని ఈఎస్ఐ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నక్షత్ర కాంట్రాక్ట ర్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ గురువారం రోడ్డు ్డపై భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ సీఐటీయూ మద్ధతుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. దాదాపు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పరిస్థిలు చాలా దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు పై అధికా రులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిం చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ సిటీ ప్రెసిడెంట్ ఈశ్వర్రావు, ట్రెజరర్ ఆర్.వాణి, యూనియన్ వైస్ ప్రెసిడెంట్ సుగుణాకర్, విశాల్, యూనియన్ సభ్యులు విశాల్, సౌమ్య, సుజిత, రాజు, అరుణ్, మల్లేశ్వరీ పాల్గొన్నారు.