Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పేట్బషీరాబాద్
టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కె.ఎం.ప్రతాప్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. గురువారం 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ కూన పద్మా ప్రతాప్గౌడ్, టీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యువ నాయకులు, యువనేస్తం ఫౌండేషన్ చైర్మెన్ కె.పి.విశాల్గౌడ్ కేక్ కట్ చేశారు. అనంతరం మిఠాయిలు పంచి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 130 సుభాష్నగర్ డివిజన్, 125 గాజులరామారం డివిజన్, 127 రంగారెడ్డి డివిజన్లలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు విశాల్గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వివిధ డివిజన్ల నుంచి వచ్చిన కార్యకర్తలు ప్రతాప్ జన్మదిన సందర్భంగా బాణా సంచాలను కాల్చి పండుగల జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు మస్కూరి పద్మ, శ్యామల, అనిల్ కుమార్ గౌడ్, నాగశేఖర్ గౌడ్, కమ్మరి గ్యానేశ్వర్, గుడ్డి కృష్ణ స్వామి, పిల్లి ఆంజనేయులు, మాజీ డైరెక్టర్లు గరిగె సతీష్, వెంకటేష్, పాషా, నాగరాజ్, దుర్గ ప్రసాద్, రమేష్, అస్లాం వరుణ్ గౌడ్, ఈశ్వర్ గౌడ్, రంగయ్య, పద్మా రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పలు కంపెనీల యూనియన్ నాయకులు, మహిళా సంఘాల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.