Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
టీఆర్ఎస్ ప్రభుత్వం మాటాలకే పరిమితమవుతుందని సీపీఐ(ఎం) నాయకులు బాలు, ఎమ్.శంకర్, కేవీపీఎస్ మండల అధ్యక్షులు పి.స్మామి, బీఎల్ఎఫ్ నాయకులు విమర్శించారు. గురువారం బాచుపల్లి మండలం నిజాంపేట్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 191లోని బస్తీల్లో సమస్యలపై సర్వే నిర్వమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ బస్తీ ఏర్పాడి పదేండ్లవుతున్న తాగునీరు, సీసీ రోడ్డు, డ్రెయినేజీ వ్యవస్థ లేదన్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెంఛన్లు, రేషన్ కార్డుల కోసం ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటమ్మ, భారతమ్మ, ప్రేమ్కుమార్, నాగరాజు, శ్రీనివాస్, నందిని పాల్గొన్నారు.