Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల విద్యాధికారి నర్సింహారెడ్డి
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
ప్రయివేటు పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బుక్స్, యూనిఫాం, స్టేషినరి విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని మండల విద్యాధికారి నర్సింహారెడ్డి హెచ్చరించారు. గురువారం ఘట్కేసర్ మండలం కొండాపూర్ గ్రామంలోని పుడమి పాఠశాలలో అక్రమంగా బుక్స్, యూనిఫాం విక్రయిస్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్.సంతోష్, మండల అధ్యక్షులు కె.శ్రీకాంత్రెడ్డి, బీజేపీ మండల కార్యదర్శి కె.రవికాంత్ రెడ్డిలు పట్టుకుని ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన పాఠశాలకు చేరుకున్న ఎంఈఓ విక్రయిస్తున్న గదిని పరిశీలించి దానికి తాళం వేశారు.
రెడ్డి ల్యాబ్ వారి సేవా పేరుతో దోపిడీ
రెడ్డి ల్యాబ్ వారి సేవా పేరుతో పాఠశాలలు ఏర్పాటుచేసి దోపిడీకి పాల్పడుతు న్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్.సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బుక్స్, యూనిఫాం విక్రయించడంతో పాటు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రయివేటు పాఠశాలల యాజమాన్యలు తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.