Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా, నిరసనలు
నవతెలంగాణ - కంటోన్మెంట్
బస్తాల బరువును తగ్గించాలని బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ హమాలీలు అన్నారు. ఈ సందర్భంగా బోయినపల్లి అంబేద్కర్ వ్యవసాయ మార్కెట్లో గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మార్కెట్ హమాలీలు నిరసన ప్రదర్శించి, ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి నర్సింహులు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఐఎన్వో నిబంధనల ప్రకారం బస్తాకి 50 కిలోలకు మించి బరువు ఉండొద్దని తెలిపారు. కానీ ఒక బస్తా 80 నుంచి 120 కేజీల బరువు ఉంటోందని తెలిపారు. తద్వారా హమాలీలు బస్తాలు మోసే క్రమంలో అధిక బరువును మోయలేక అక్కడే కుప్పకూలిపోతున్నారని, ఇటీవలె హమాలీలు బరువు మోయలేక కుప్పకూలిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విధంగా చనిపోయిన హమాలీల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వలేదని విమర్శించారు. వెంటనే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అంతే కాకుండా బరువు తగ్గించాలన్న విషయంపై అనేక సార్లు అధికారులతో సమావేశమైనా పెడ చెవిన పెడుతున్నారని ధ్వజమెత్తారు.
స్పందించిన మార్కెట్ అధికారిణి హర్షపద్మ
200ల మందికి పైగా హమాలీలు పాల్గొని మార్కెట్ నుంచి ర్యాలీగా వచ్చి కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించా రు. అధికారులు సమాధానం ఇవ్వాలని నినాదాలు చేయడంతో మార్కెట్ అధికారిని హర్షపద్మ స్పందించిం ది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తు న్నామన్నారు. ఇప్పటికే విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్ళామన్నారు. పదిహేను రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీచ్చారు. అలాగే ఎక్స్గ్రేషియా విషయాన్నీ మాట్లాడుతామన్నారు. రైతులకు ఏ విధంగా ఇన్సురెన్స్ ఉందో, హమాలీలకూ ఇన్సురెన్స్ చేయించాలన్న విషయాన్ని అధికారులతో మాట్లాడుతామని అన్నారు. సమస్య పరిష్కరించేంత వరకు హమాలీలు మార్కెట్ అభివృద్ధికి సహకరించాల ని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బోసు, హామాలీల యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజయ్య, ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య, కోశాధికారి ఐలయ్య, ఉపాధ్యక్షులు కొమురయ్య, బి.రాములు, వసంత్, ఘట్టయ్య, బాలయ్య, పి.రాజు పాల్గొన్నారు.