Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ సత్యనారాయణ
నవతెలంగాణ-రాజేంద్రనగర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల ను వెంటనే రెగ్యూలరైజ్ చేయాలని సీఐటీయూ రంగా రెడ్డి జిల్లా కార్యదర్శి ఈ.సత్య నారాయణరెడ్డి అన్నారు. గురువారం పారిశుధ్య కార్మికులతో కలిసి రాజేంద్రనగర్ సర్కిల్ ఉపకమిషన్కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏండ్లు పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను ఇంత వరకూ రెగ్యూలరైజ్ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులందరినీ రెగ్యూలరైజ్ చేయాలని, కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలన్నారు. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పనిముట్లు అందించాలన్నారు. కార్యక్రమంలో బీఎల్ఎఫ్ రంగారెడ్డి జిల్లా నాయకులు వి.జైపాల్రెడ్డి, టి.ఆనంద్, హరి, పెంటయ్య, యాదమ్మ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.