Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మలక్పేట
మొదటి భార్య ఉండగానే మరో మహిళను వివాహమాడి గుట్టు చప్పుడు కాకుండా సంసారం సాగిస్తోన్న భర్తపై మొదటి భార్య బంధువులతో కలిసి రెడ్ హ్యాండెడ్గా భర్తను పట్టుకున్న సంఘటన చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న అనిల్శేష్కుమార్ 2009లో రాజమండ్రికి చెందిన రమణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు ఉన్నది. కొన్నేండ్లుగా కాపురం సజావుగా సాగింది. కుటుంబ కలహాల వల్ల 2013 నుంచి రమణితో దూరంగా ఉంటున్నాడు. దీంతో రమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు. దాంతో పాటు రమణికి దొరకకుండా తప్పించుకు తిరుగుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. కొంతకాలంగా ప్రత్యూష అనే మహిళతో సంబంధాలు పెట్టుకుని ఆమెను వివాహం చేసుకుని మొదటి భార్యకు తెలవకుండా చైతన్యపురిలోని హనుమాన్నగర్లో సంసారం కొనసాగిస్తూ వచ్చాడు. భర్త కొన్నేండ్లుగా ఓపిక పట్టినప్పటికీ అనిల్లో మార్పు రాకపోవడంతో చైతన్యపురిలోనే ఉన్నాడనే పక్కా సమాచారం అందుకున్న రమణి కుటుంబ సభ్యులు అనిల్, ప్రత్యూషలు ఉంటున్న నివాసంపై దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దేహశుద్ధి చేశారు. మొదటి భార్య రమణి మాట్లాడుతూ కేవలం డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడని, తాను, తన కూతురిపై ఎలాంటి ప్రేమ లేదని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.