Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్పేట్
చార్మినార్ అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో స్పెషలిస్ట్ అవుట్ రీచ్ క్యాంప్ను గౌలిపుర లాల్ దర్వాజాలోని మైదానం వద్ద గురువారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని గౌలిపుర వార్డు సభ్యుడు కె సురేష్బాబు సందర్శించి, బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించుకున్నారు. రోగులకు అందుతున్న వైద్య పరీక్షలు, అందిస్తున్న మందులను అడిగి తెలుసుకున్నారు. బీపీ , షుగర్ వ్యాక్సినైజెషన్, థైరాడ్ పరీక్షలు చేసి మందులు ఇవ్వడంతో పాటు గర్భిణులకు ఏఎన్సీ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎస్పీహెచ్వో, వైద్య అధికారిణి డాక్టర్ జి.శోభారాణి తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో చార్మినార్ అర్బన్ హెల్త్ సెంటర్ స్టాఫ్, ఆశావర్కర్లు పాల్గొన్నారు.