Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కూల్ పిల్లలను తీసుకెళ్లే ఆటోలపై నజర్
- స్పెషల్ డ్రైవ్లో 130 కేసుల నమోదు
- లైసెన్స్ లేని డ్రైవర్లపై కేసులు
- జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసుల సూచన
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో సురక్షిత ప్రయాణం కోసం అన్ని చర్యలు చేపడుతున్న పోలీసులు పిల్లలను స్కూల్కు తీసుకెళ్లే ఆటోలపై ప్రత్యేక దృష్టి కేంద్రీ కరించారు. నగర పోలీస్ కమి షనరేట్ పరిధిలల్లో పిల్లలను స్కూల్ తీసుకెళ్లే ఆటోలు ఫిట్నెస్గా ఉన్నాయా? లేదా? ఒకేసారీ ఎంత మందిని తీసుకెళ్తున్నారని ఆరా తీస్తున్నారు. డ్రైవర్కు లైసెన్స్ ఉందా.. లేదా? ఉంటే ఎంత కాలం అనుభవం ఉందని తనిఖీలు చేస్తున్నారు. పిల్లల విషయంతో జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తల్లిదండ్రులను సైతం అప్రమత్తం చేస్తున్నారు. గురువారం సుల్తాన్ బజార్ పోలీస్స్టేషన్ పరిధిలోని వివిధ స్కూల్స్కు తీసుకెళ్లే ఆటోలపై ట్రాఫిక్ పోలీసులు ఉదయం 8:30కు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో 130 ఆటోడ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. 9 మంది ఆటో డ్రైవర్లకు లైసెన్స్లు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. కోఠి బస్టాప్లో నిలిపిన ఆటోలు, క్యాబ్లను గుర్తించిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. పలు ప్రాంతాలల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను చేశారు. పలువురు ఆటోడ్రైవర్లు మోతాదుకు మించి మద్యం సేవించి నట్టుగుర్తించిన పోలీసులు కేసులు నమోదు చేశారు. చాంద్రాయాణగుట్టకు చెందిన మహ్మద్జలీల్ అనే ఆటోడ్రైవర్ తన ఆటోలో 9 మంది పిల్లలను తీసుకెళ్తుండగా అతనిపై చర్యలు తీసుకున్నారు.