Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు పోస్టుల మంజూరు, నిర్వహణ వ్యయం
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు
- మూడో స్థాయీ సంఘం సమావేశంలో ఆమోదం
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ పునరువ్యవస్తీకరణలో భాగంగా ప్రతిపాదిత 50 సర్కిళ్లు, 10 జోన్లకు సంబంధించి సిబ్బంది, అధికారుల నియామకం విధానాలు, 1200 అదనపు పోస్టులు, అదనపు పోస్టులకు సంబంధించి సంవత్సరానికి అయ్యే రూ.98 కోట్ల అదనపు వ్యయాన్ని భరించేందుకు మంజూరు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని బల్దియా నిర్ణయించింది. ఈ అంశాన్ని స్థాయీ సంఘం సమావేశం ఆమోదించింది. గురువారమ మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన మూడో స్థాయీ సంఘం సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు.
- ప్రతి జోన్లో 50 లగ్జరీ వాష్ రూమ్ (లూ-కేఫే)లను ఏర్పాటు చేసేందుకు టెండర్లను పిలిచే ప్రతిపాదనలకు ఆమోదం.
- చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్లో భాగంగా లాడ్ బజార్లోని మహబూబ్ చౌక్ (ముర్గీచౌక్) గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లుగా రెండు అంతస్తుల్లో రూ.36కోట్ల వ్యయంతో చేపట్టే ప్రతిపాదనలకు ఆమోదం. ముర్గీచౌక్ పునరునిర్మాణంలో అండర ్గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటుకు సాధ్యాసాద్యాలను పరిశీలించాల్సిందిగా ప్రాజెక్ట్ విభాగానికి సూచన.
- పత్తర్గట్టి నుండి చార్మినార్ మార్గంలో ఉన్న పత్తర్ట్టి స్టోన్ ఆర్కేడ్ పునరుద్దరణకు మిగిలిన పనులను రూ.5.97కోట్ల వ్యయంతో చేపట్టడానికి ప్రతిపాదనలకు ఆమోదం.
- పంజాగుట్ట చట్నీస్ వద్ద రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న శ్మశానవాటికపై స్టీల్ ప్లేట్ బ్రిడ్జిని రూ.5.95కోట్ల వ్యయంతో చేపట్టడానికి ఆమోదం.
- ఎర్రమంజిల్లోని ప్రనవ్ లాడ్జి నుండి హెరిటేజ్ ఫ్రెష్ వరకు 40 అడుగుల రోడ్డు విస్తరణ సందర్భంగా 15 ఆస్తులను సేకరించే తీర్మానానికి ఆమోదం.
- ప్రభుత్వ ఉద్యోగులకు 24.104శాతం నుండి 25.676 శాతానికి కరువు భత్యం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను జీహెచ్ఎంసీ ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తింపజేసే ప్రతిపాదనలకు ఆమోదం.
- గ్రేటర్ హైదరాబాద్లో చెరువుల పునరు నిర్మాణం, అభివద్దిని పెద్ద ఎత్తున చేపడుతున్న దష్ట్యా ఏర్పడే న్యాయపరమైన సమస్యలను ఎదుర్కో వడానికి లేక్స్ విభాగానికి ప్రత్యేకంగా స్టాండింగ్ కౌన్సిల్ను నియమించే తీర్మానానికి ఆమోదం.
- 2018 స్టాండింగ్ కమిటి సమావేశాలను ప్రతి గురువారం మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించే తీర్మానానికి ఆమోదం.
- మలక్పేట్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్రంగా ఉండే ట్రాఫిక్ రద్దీని ఎదుర్కోవడానికి రైల్వే అండర్ బ్రిడ్జి (ఆరయూబీ) వద్ద అదనపు మార్గం (వెంట్)ను ఏర్పాటు చేయడానికిగాను అడ్డుగా ఉన్న ఏడు ఆస్తుల సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం.
- గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మరింత మెరుగైన జీవనాన్ని అందించేందుకుగాను ఫారెస్ట్ బ్లాక్లను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు మేడ్చల్ జిల్లా బోరంపేట్, రామారం, సూరా రం ఫారెస్ట్ క్లస్టర్లో 455.54 హెక్టార్లలో రూ.12.18కోట్ల వ్యయంతో ఫారెస్ట్ బ్లాక్, రంగారెడ్డి జిల్లాలోని నాదర్గుల్లో 42.90 హెక్టార్లలో రూ.2.02కోట్ల వ్యయంతో మరొకటి, మదినగూడ క్లస్టర్లో 97.12 హెక్టార్లలో రూ. 3.55కోట్ల వ్యయంతో ప్రతిపాదిత ఫారెస్ట్ బ్లాక్ల ఏర్పాటుకు ఆమోదం. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎ. కష్ణ, గొల్లూరు అంజయ్య, ఎన్.జగదీశ్వర్గౌడ్, తూము శ్రవన్కుమార్, ముద్దగౌని లక్ష్మిప్రసన్న, ఎన్. శేష కుమారి, ఎ.సరస్వతి, సింగిరెడ్డి స్వర్ణలత, అబ్దుల్ వాహెబ్, నస్రీన్ సుల్తానా, మహ్మద్ మాజీద్ హుస్సేన్, మహ్మద్ మొబిన్, మహ్మద్ మూర్తుజా అలీ, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, అదనపు కమిషనర్లు భారతి హౌలీకేరి, అద్వైత్కుమార్సింగ్, శతిఓజా, సిక్తా పట్నాయక్, ముషారఫ్అలీ, దాసరి హరిచందన, జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులు హాజరయ్యారు.